పవన్ ట్విస్ట్ అదేనట… బీజేపీకి మద్దతు పైపైనే?
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన బీజేపీకి మద్దతిస్తుందా? బయటకే మద్దతా? లోపాయికారిగా టీడీపీకి మద్దతిస్తుందా? ఇదే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన బీజేపీకి మద్దతిస్తుందా? బయటకే మద్దతా? లోపాయికారిగా టీడీపీకి మద్దతిస్తుందా? ఇదే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన బీజేపీకి మద్దతిస్తుందా? బయటకే మద్దతా? లోపాయికారిగా టీడీపీకి మద్దతిస్తుందా? ఇదే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి పార్లమెంటుఉప ఎన్నికల బరిలో తాము పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే ఇందులో లోపాయికారీ ఒప్పందం ఉందన్న అనుమానం ఉంది. తొలినుంచి తామే పోటీ చేస్తామని బల్లగుద్ది చెప్పిన పవన్ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకోవడంతోనే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ…..
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పంథా కొనసాగింది. అనేక చోట్ల టీడీపీ, జనసేనలు లోపాయికారిగా ఒకరికొకరు మద్దతిచ్చుకున్నాయి. అనేక చోట్ల ఈ ఫార్ములా పనిచేసింది. అయితే తిరుపతి ఉప ఎన్నికలోనూ ఇదే జరుగుతుందని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినప్పటికీ క్యాడర్ మాత్రం టీడీపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయింది.
గెలిచే అవకాశం లేకపోవడంతో…..
దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఇక్కడ బీజేపీకి గెలిచే అవకాశాలు లేవు. ప్రధాన శత్రువు వైసీపీని ఓడించాలంటే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడం వేస్ట్. అందుకే టీడీపీ అభ్యర్థికి మద్దతు లోపాయికారీగా ఇవ్వాలన్నది జనసేన స్థానిక నేతల అభిప్రాయంగా ఉంది. తొలినుంచి తాము కోరుకున్న సీటును ఇవ్వకుండా బీజేపీ పదే పదే ఇబ్బంది పెట్టింది. అంతేకాదు రెండు నెలల ముందే సోము వీర్రాజు బీజేపీ అభ్యర్థి ఉంటారని ప్రకటించారు.
ప్రచారానికి కూడా….
అయితే పవన్ కల్యాణ్ తమ పార్టీ మద్దతిస్తుందని ప్రకటించారు. కానీ జనసైనికులు మాత్రం బీజేపీకి మద్దతిచ్చేందుకు ఇష్టపడటం లేదు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి కూడా పవన్ కల్యాణ్ ను రావద్దని జనసైనికులు ఇప్పటికే కోరినట్లు చెబుతున్నారు. జనసేన అభ్యర్థి అయితేనే తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి కూడా రారని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికే జనసేన మద్దతు తెలపనుందని సమాచారం.