పవన్ పాలిటిక్స్ కి దారేదీ ?
పాపం పవన్ కళ్యాణ్. ఏపీలో అధికారం లేకపోయినా కేంద్రంలో ఉన్న బీజేపీ చలువతో ఇక్కడ హడావుడి చేద్దామని తెగ ఉబలాటపడ్డారు. అందుకే రెండు సీట్లలో ఓడిన వెంటనే [more]
పాపం పవన్ కళ్యాణ్. ఏపీలో అధికారం లేకపోయినా కేంద్రంలో ఉన్న బీజేపీ చలువతో ఇక్కడ హడావుడి చేద్దామని తెగ ఉబలాటపడ్డారు. అందుకే రెండు సీట్లలో ఓడిన వెంటనే [more]
పాపం పవన్ కళ్యాణ్. ఏపీలో అధికారం లేకపోయినా కేంద్రంలో ఉన్న బీజేపీ చలువతో ఇక్కడ హడావుడి చేద్దామని తెగ ఉబలాటపడ్డారు. అందుకే రెండు సీట్లలో ఓడిన వెంటనే అర్జంటుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక ఏపీలో సరికొత్త రాజకీయ శకం మొదలైందని కూడా ఆర్భాటంగా ప్రకటించారు. ఇదంతా ఈ ఏడాది సంక్రాంతి పండుగ తరువాత జరిగిన ముచ్చట. మరో మూడు నెలల్లో మళ్ళీ పెద్ద పండుగ వస్తోంది. కానీ ఇంతలోనే ఎంత మార్పు అన్నట్లుగా బీజేపీ జనసేన బంధం ఉందని అంటున్నారు. బీజేపీకి కావాల్సింది జగన్ కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి జగన్ అతి పెద్ద విలన్. దాంతో ఈ బంధానికి మెల్లగా బీటలు పడుతున్నాయని విశ్లేషణలు ఉన్నాయి.
టీడీపీ పాటే….
అమరావతి ఒక్కటే రాజధాని కావాలి. మూడు రాజధానులు విద్వేషపూరితమైన ఆలోచన. కక్షలకు అభివృద్ధిని బలిపెట్టవద్దు, అర్ధరహితమైన, రాజ్యాంగరహితమైన ఆలోచన మూడు రాజధానుల ప్రతిపాదన. ఈ రకమైన కఠినపదజాలంతో జనసేన అఫిడవిట్ రూపుదిద్దుకుంది. ఇక ఈ మాటలు అన్నీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచి ఎపుడూ జాలువేరేవే. ఓ విధంగా చెప్పాలంటే బాబు డిమాండ్ కి తగినట్లుగానే పవన్ కళ్యాణ్ జనసేన తరుపున దాఖలు చేసిన అఫిడవిట్ ఉందని అంటున్నారు.ఇదే హైకోర్టుకు ఆ పార్టీ తాజాగా సమర్పించింది. ఇక్కడ సొంతంగా జనసేన తన ఆలోచన ఇదని చెప్పుకుంది. మరి పొత్తు పార్టీ బీజేపీ ఆలోచనలేంటో కనీసంగా పట్టించుకున్నట్లుగా లేదు.
సీమ ధ్యాస లేదా ….
పోనీ విశాఖలో రాజధాని వద్దు అన్నది పవన్ కళ్యాణ్ డిమాండ్ అనుకున్నా రాయలసీమకు తీరని అన్యాయం జరిగింది అని పలు సార్లు ఇదే పవన్ అన్నారు కదా. పైగా అప్పట్లో ఆయన కర్నూల్ పర్యటనలో రాజధాని చేయాల్సిన ప్రాంతం అంటూ సానుభూతి చూపారు కదా. కనీసం హైకోర్టు అయినా అక్కడ పెట్టమని ఇపుడు అఫిడవిట్ లో ఎందుకు కోరలేకపోతున్నారో ఆయన చెబితేనే బాగుంటుంది మరి. ఇక బీజేపీ కూడా మూడు రాజధానుల విషయంలో కొంత విభేదిస్తున్నప్పటికీ కర్నూలు లో హై కోర్టు అంటే మాత్రం ఓకే అంటోంది. అంటే మిత్ర పక్షానికి ఉన్న పట్టింపు కూడా లేకుండా జనసేన అన్నీ అక్కడే అన్న టీడీపీ స్టాండ్ తో మాట్లాడుతున్నపుడు ఇక భావసారూప్యం ఏముంటుంది. జగన్ మూడు అన్నాడు కాబట్టి గుడ్డిగా వ్యతిరేకించాలన్న తపన టీడీపీకి ఉంటే ఉండొచ్చు కానీ కొత్త రాజకీయం చేస్తామని బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఆ సోయి లేకపోతే ఎలా అన్నదే విమర్శకుల మాట.
అదేనా కారణం…?
ఇక జాతీయ రాజకీయాలు చూసుకుంటే కేంద్రంలోని బీజేపీకి జగన్ ఆపద్భాంధవుడు అయిపోయాడు. మోడీకి నమ్మకమైన నేస్తం అయ్యారు. కీలక బిల్లులకు మద్దతు ఇస్తూ బాగా దగ్గరయ్యాడు. ఇక మోడీ కూడా కరోనాపైన ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో జగన్ పాలన ఏపీలో భేష్ అంటూ బాహాటంగా కీర్తించడం విశేష పరిణామమే. బహుశా ఇవన్నీ చూసిన తరువాతనే పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరం జరుగుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. సరే పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉన్నా కూడా ఆ పొత్తు ధర్మం రెండు పార్టీలు పాటించడంలేదు అంటున్నారు. ఇలా చెరో దారిన ఆలోచిస్తున్న ఈ పార్టీలను తెరవెనక పెద్ద పార్టీలు వైసీపీ, టీడీపీ లాగేస్తున్నాయేమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయం మళ్ళీ కనుక మార్చుకుంటే ఆయన మీద జనాలకు ఎంత వరకూ విశ్వసనీయత ఉంటుందో చెప్పడం కష్టమే.