సేఫ్ జోన్ లో బొబ్బిలి రాజు.. అందుకేనా?
విజయనగరం జిల్లాలో అందరూ రాజులే. ప్రధానంగా పూసపాటి, బొబ్బిలి రాజులు రాజకీయాలను శాసిస్తుంటారు. అయితే బొబ్బిలి రాజులు సేఫ్ జోన్ లో ఉన్నారంటున్నారు. అధికార పార్టీ వైసీపీ [more]
విజయనగరం జిల్లాలో అందరూ రాజులే. ప్రధానంగా పూసపాటి, బొబ్బిలి రాజులు రాజకీయాలను శాసిస్తుంటారు. అయితే బొబ్బిలి రాజులు సేఫ్ జోన్ లో ఉన్నారంటున్నారు. అధికార పార్టీ వైసీపీ [more]
విజయనగరం జిల్లాలో అందరూ రాజులే. ప్రధానంగా పూసపాటి, బొబ్బిలి రాజులు రాజకీయాలను శాసిస్తుంటారు. అయితే బొబ్బిలి రాజులు సేఫ్ జోన్ లో ఉన్నారంటున్నారు. అధికార పార్టీ వైసీపీ కేవలం పూసపాటి అశోక్ గజపతిరాజుపైనే దృష్టి పెట్టింది. ఆయననే ఇబ్బందుల్లోకి నెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. అదే జిల్లాలో ఉన్న బొబ్బిలి రాజుల జోలికి మాత్రం పోకపోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమయింది.
వైసీపీలో గెలిచి.. టీడీపీలోకి వెళ్లి…
బొబ్బిలి నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి సుజయ కృష్ణరంగారావు గెలుపొందారు. అయితే ఆపరేషన్ ఆకర్ష్ తో ఆయన టీడీపీలోకి వెళ్లి మంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో సుజయ కృష్ణరంగారావు ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బొబ్బిలి రాజుల కుటుంబం పెద్దగా రాజకీయాల జోలికి రావడం లేదు. అధికార పార్టీపై విమర్శలు చేయడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు.
అశోక్ పైనే కాన్సంట్రేషన్….
విజయనగరం జిల్లాలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజును మాత్రం వైసీపీ టార్గెట్ చేసిందనే చెప్పాలి. ఆయనను ఇరకాటంలోకి నెడితే పార్టీ పరిస్థితి దిగజారుతుందని భావించిన వైసీపీ ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ నుంచి తప్పించి ఆయనను మానసికంగా దెబ్బతీసింది. అశోక్ గజపతి రాజు వెంట పార్టీ నేతలు కూడా పెద్దగా నడవడం లేదు. ఆయన పార్టీలో దాదాపు ఒంటరిగా మారిపోయారు.
పలకరింపులూ లేవే….
అశోక్ పై వైసీపీ కక్ష సాధింపులకు దిగడంతో సుజయ కృష్ణరంగారావు, బేబినాయనలు కొంత వెనక్కు తగ్గారంటున్నారు. అందుకే జిల్లా రాజకీయాలను కూడా వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. అశోక్ కు అండగా నిలిచేందుకు కూడా సుజయకృష్ణ రంగారావు ముందుకు రాలేదు. ఇదంతా చూస్తుంటే వైసీపీకి బొబ్బిలి రాజులు దగ్గరవుతున్నట్లే కనపడుతుందంటున్నారు. మొత్తానికి బొబ్బిలి రాజులు ప్రస్తుతానికి సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు టాక్ జిల్లాలో బలంగా విన్పిస్తుంది.