పీవీ కుమార్తెకు అత్యున్నత పదవి…?
పీవీ నరసింహారావు. దేశం గర్వించే మహా నాయకుడు. తనకంటూ ఏమీ చూసుకోకుండా దేశ హితం కోసం తమ మేధస్సుని అంతా ఉపయోగించిన మాననీయుడు. దేశానికి తొలి ప్రధానిగా [more]
పీవీ నరసింహారావు. దేశం గర్వించే మహా నాయకుడు. తనకంటూ ఏమీ చూసుకోకుండా దేశ హితం కోసం తమ మేధస్సుని అంతా ఉపయోగించిన మాననీయుడు. దేశానికి తొలి ప్రధానిగా [more]
పీవీ నరసింహారావు. దేశం గర్వించే మహా నాయకుడు. తనకంటూ ఏమీ చూసుకోకుండా దేశ హితం కోసం తమ మేధస్సుని అంతా ఉపయోగించిన మాననీయుడు. దేశానికి తొలి ప్రధానిగా పండిట్ నెహ్రూ చూపించిన దారి మూడున్నర దశాబ్దాల పాటు భారత్ అజేయంగా సాగేందుకు దోహదపడింది. ఆ తరువాత మారిన ప్రపంచ పరిస్థితుల్లో పోటీ యుగంలో భారత్ ఎటు వైపు వెళ్ళాలో తెలియని సందిగ్దత ఎదురైంది. ఒక దశలో దేశంలోని బంగారం అమ్ముకునే దారుణాన్ని కూడా మాజీ ప్రధాని చంద్రశేఖర్ టైమ్ లో జరిగింది. అపుడు పగ్గాలు చేపట్టిన పీవీ దేశం దశ దిశా మార్చేశారు. అలా ఆర్ధిక సంస్కరణలతో దేశం ముందుకు సాగిపోయింది.
పీవీ స్మరణలో…….
పీవీ లాంటి వారు నూటికో కోటికో ఒకరే పుడతారు. వారికి వారసులు అంటూ ప్రత్యేకంగా ఉండరు. వారి ఆశయాలను ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వారే సిసలైన వారసులు. ఇక భారత మాత ముద్దు బిడ్డగా పీవీ ఉంటే ఆయన తెలంగాణాలో పుట్టడంతో కేసీయార్ ఆయన్ని గొప్పగా సంస్మరించుకుంటున్నారు. పీవీ శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిర్వహించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమే. ఆ సందర్భాన పీవీ కుమార్తె సురభి వాణీదేవిని శత జయంతి కమిటీ మెంబర్ గా నియమించి ఆ కుటుంబాన్ని మళ్ళీ చేరదీశారు కేసీఆర్.
అనూహ్యంగా అలా…..
ఇక పీవీ పెద్ద కుమారుడు పీవీ రంగారావు 1990 దశకంలో నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మరో కుమారుడు పీవీ ప్రభాకరరావు కూడా ఎమ్మెల్సీగా చేశారు. రంగారావు దివంగతులు కాగా ప్రభాకరరావు పెద్దగా రాజకీయాల్లో కనిపించడంలేదు. ఇపుడు కుమార్తె సురభి వాణీదేవిని టీయారెస్ పక్షాన ఎమ్మెల్సీగా నిలబెట్టి మరీ కేసీఆర్ గెలిపించారు. ఆమెను పీవీ పేరు కోసం బలిపశువును చేస్తున్నారు అన్న విపక్షాల విమర్శలు తప్పు అని నిరూపించి సర్వశక్తులూ ఒడ్డి మరీ పెద్దల సభలో అడుగుపెట్టేలా చేశారు. దీంతో ఆమె తాను అనుకోకుండానే రాజకీయాల్లోకి జీవన సంధ్యా సమయంలో రావడం జరిగిందని భావించాలి.
సమున్నత స్థానమే….?
పెద్దల సభ అంటేనే ఎన్నతగినది. అందులోకి అడుగుపెట్టిన సురభి వాణీదేవిని వట్టి ఎమ్మెల్సీగా ఉంచడం కేసీఆర్ కి ఇష్టం లేదని అంటున్నారు. అందుకే ఆమెను శాసనమండలి చైర్ పర్సన్ ని చేస్తారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత చైర్ పర్సన్ గుత్తా సుఖేందరరెడ్ది అనారోగ్య కారణాల రిత్యా ఆ పదవి నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఉన్నతమైన పదవిలో సురభి వాణీదేవిని కూర్చోబెట్టడం ద్వారా పీవీ లెగసీని కంటిన్యూ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. ఇదే కనుక జరిగితే క్యాబినెట్ ర్యాంక్ కలిగిన పదవిలో పీవీ వారసురాలు కుదురుకుంటారన్న మాటే. ఏది ఏమైనా పీవీ పట్ల తన భక్తి ప్రపత్తులు కేసీయార్ బాగానే చాటుకుంటున్నారు అన్నది ఇపుడు అంతా చెబుతున్న మాట.