బాబు వెడలె…అమరావతికి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన వివాదంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతుండటం, ఇసుక సమస్య తెరమరుగు కావడంతో చంద్రబాబు రాజధాని అమరావతి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన వివాదంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతుండటం, ఇసుక సమస్య తెరమరుగు కావడంతో చంద్రబాబు రాజధాని అమరావతి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన వివాదంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతుండటం, ఇసుక సమస్య తెరమరుగు కావడంతో చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో వైసీపీపై పోరుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు ఆయన అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో గతంలో తాము నిర్మించిన భవనాలను పరిశీలించనున్నారు. నిలిచిపోయిన పనులను కూడా చూస్తారు.
వివాదాస్పదంగా మారి….
అయితే చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటన వివాదాస్పదంగా మారింది. రైతులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకటి వైసీపీకి అనుకూల వర్గం అయితే మరొకటి చంద్రబాబును అభిమానించే వర్గం. అమరావతికి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో చోటు కల్పించడంతో రాజధాని నిర్మాణంపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకూ రాజధాని నిర్మాణంపై పెదవి విప్పలేదు. అసలు రాజధాని అక్కడ ఉంటుందా? లేదా? అన్న క్లారిటీ కూడా జగన్ ఇవ్వలేదు.
రైతుల పక్షాన నిలబడి…..
మరోవైపు రాజధాని ప్రాంతంలో ఉచితం భూములిచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు కేటాయించిన ప్లాట్లు అభివృద్ది చేయకపోవడం, రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోవడంతో భూముల ధరలు పడిపోయాయి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలుకావడం లేదు. దీంతో రైతుల పక్షాన నిలిచి రాజధాని అమరావతిపై తనకున్న విజన్ ను మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సయితం జగన్ ను ఇరుకున పెట్టేందుకు రాజధాని అంశాన్ని లేవనెత్తాలని యోచిస్తున్నారు.
క్షమాపణ చెప్పాలంటూ…..
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు పర్యటనపై విమర్శలు చేస్తోంది. ఐదేళ్లు రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలనే నిర్మించారంటున్నారు. బొత్స సత్యనారాయణ అయితే అమరావతిని శ్మశానంతో పోల్చారు. రాజధాని రైతులు కొందరు ఇక్కడకు వస్తే చంద్రబాబు తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ఇచ్చిన మాటను నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్నా నిలబెట్టుకోలేకపోయిన చంద్రబాబు అమరావతి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటన ఉత్కంఠగా మారింది.