సెలెక్ట్ ను హోల్డ్ లో పెడితే?
రెండు కీలక బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు శాసనమండలి ఛైర్మన్ షరీఫ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ముందుకు సాగడం లేదు. చంద్రబాబు ఎత్తుకు ముఖ్యమంత్రి వైఎస్ [more]
రెండు కీలక బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు శాసనమండలి ఛైర్మన్ షరీఫ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ముందుకు సాగడం లేదు. చంద్రబాబు ఎత్తుకు ముఖ్యమంత్రి వైఎస్ [more]
రెండు కీలక బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు శాసనమండలి ఛైర్మన్ షరీఫ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ముందుకు సాగడం లేదు. చంద్రబాబు ఎత్తుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైఎత్తు వేయడమే ఇందుకు కారణం. ఏపీ డిసెంట్రలైజ్ అండ్ ఈక్వల్ డెవెలెప్ మెంట్ రీజియన్స్ యాక్ట్ 2020 తో పాటు అమరావతి మెట్రో డెవెలెప్ మెంట్ అధారిటీ 2020 బిల్లులను సెలెక్ట్ కమిటీకి మండలి ఛైర్మన్ పంపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ సెలెక్ట్ కమిటీయే ఏర్పాటు కాలేదు.
పేర్లు పంపాలంటూ….
సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపాలంటూ ఇప్పటికే శాసనమండలి ఛైర్మన్ అన్ని పార్టీలకూ లేఖలు రాశారు. ఒక్కొక్క కమిటీలో టీడీపీ నుంచి ఐదుగురు సభ్యులు, వైసీపీ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు పీడీఎఫ్ నుంచి ఒకరు ఉంటారు. దీనికి మంత్రులు నేతృత్వం వహిస్తారు. అయితే ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ రెండు కమిటీలకు ఐదుగురు పేర్లు చొప్పున లెజిస్లేచర్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు పంపింది. వైసీపీ మాత్రం ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, తాము పేర్లను పంపమని పేర్కొంది.
బీజేపీ, పీడీఎఫ్ లు….
ఇక బీజేపీ, పీడీఎఫ్ ల నుంచి కూడా పేర్లు అందలేదు. దీంతో టీడీపీ ఆ రెండు పార్టీలను పేర్లను పంపాల్సిందిగా పదే పదే కోరుతుంది. అయితే ఇంతవరకూ వాటి నుంచి రెస్పాన్స్ రాలేదు. అయితే బీజేపీ నేతలపై కేంద్రంలో ప్రముఖ స్థానంలో ఉన్న ఒక పెద్దాయన నుంచి వత్తిడి తేవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, పీడీఎఫ్ లు పేర్లను పంపితే కాని సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాదు. దీంతో బీజేపీ నేతలను పేర్లను పంపించేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. ఇక పీడీఎఫ్ నేతలు మాత్రం ఇప్పటి వరకూ ససేమిరా అంటున్నారు.
జగన్ ఎత్తుగడ…..
దీంతో చంద్రబాబు ఎత్తుగడ ఫలించకుండా వైసీపీ అడ్డుకుంటున్నట్లే కనపడుతుంది. పేర్లు పంపకుంటే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాదు. మూడు నెలల వరకూ సెలెక్ట్ కమిటీ నియామకం జరగకపోతే ఆటోమేటిక్ గా బిల్లులు తిరిగి శాసనసభకు వస్తాయి. అప్పడు ఆమోదించుకునే వీలుంది. ఈ ప్లాన్ ను అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధికారులను సభా ధిక్కరణ కిందకు తీసుకువస్తామని టీడీపీ హెచ్చరిస్తుంది. దీంతో అసలు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
.