ఇందులో గజనీ ఎవరు?
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ చెప్పుకోవడానికి రాజధాని అంటూ లేదు. ఇక హైదరాబాద్ తరహా నగరం కూడా లేదు, విశాఖపట్నం తప్ప పెద్ద [more]
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ చెప్పుకోవడానికి రాజధాని అంటూ లేదు. ఇక హైదరాబాద్ తరహా నగరం కూడా లేదు, విశాఖపట్నం తప్ప పెద్ద [more]
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ చెప్పుకోవడానికి రాజధాని అంటూ లేదు. ఇక హైదరాబాద్ తరహా నగరం కూడా లేదు, విశాఖపట్నం తప్ప పెద్ద సిటీలు లేని దుస్థితిలో నవ్యాంధ్ర ఉంది. అప్పులు చూస్తే విభజనకు ముందు 90 వేల కోట్లు ఉంటే అవి మూడు లక్షల కోట్లకు చేరుకున్నాయి. భారీ పరిశ్రమలు లేవు విభజనకు ముందు కేవలం 60 శాతం జనాభా మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడితే ఇపుడు 75 శాతానికి పైగా ఆధారపడుతున్నారు. ఆర్ధిక ప్రగతి కూడా అంతగా లేదు. ఒక విధంగా చెప్పాలంటే మొదటి నుంచి ఏపీని మళ్ళీ నిర్మించుకుని రావాలి. చంద్రబాబునాయుడు అనుభవశాలి అని మొదటిసారి ముఖ్యమంత్రిని చేస్తే ఆయన రాజకీయం కోసమే కధ మొత్తం నడిపారు. ఫలితంగా ఏపీ ఎక్కడ ఉందో మళ్ళీ అక్కడే ఉందని కూడా అంటారు. ఇపుడు కొత్త సర్కార్ వచ్చింది. మరి ఏపీ విషయంలో, నవ నిర్మాణం విషయంలో విపక్షాల ఆలోచనలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది.
కుర్చీ యావతోనేనా…?
ఏపీలో సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ గా చంద్రబాబుని చెప్పుకోవాలి. ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి చంద్రబాబు రాష్ట్ర అభివృధ్ధి కోసం నిర్మాణాత్మమైన సలహా సూచనలు ఇస్తున్నారా అన్నది ఆలోచన చేస్తే లేదు అన్న సమాధానమే వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు రాజకీయం కోసమే విమర్శలు చేస్తారని పేరుందంటారు. ఆయనది కుర్చీ బాధ అని వైసీపీ నేతల విమర్శలు కూడా ఉన్నాయి. నష్టపోయిన రాష్ట్రానికి పెద్ద దిక్కుగా,సీనియర్ నేతగా చంద్రబాబు ఆలోచించడం లేదని మేధావుల మాటగా కూడా ఉంది. అధికారం కోసం ఎన్నికల వేళ పోరాడుదాం, అయిదేళ్ళు అభివ్రుధ్ధికి అంకితం అవుదాం, రాజకీయాలు వద్దు అన్న మాటలు అప్పట్లో చెప్పింది చంద్రబాబే. మరి ఆయన ఎంతవరకూ వాటిని ఆచరణలో పెడుతున్నారు. ఆందోళనలు చేస్తే అభివ్రుధ్ధి ఆగిపోతుందని చెప్పిన చంద్రబాబే ఇపుడు తరచూ రోడ్డెక్కుతున్నారంటేనే అర్ధం చేసుకోవాలి మరి. బాబు గజనీలా మారారా? అన్న సందేహం కలుగుతోంది.
కొత్త రాజకీయం ఏదీ…?
ఇక జనసేనానిగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తాను కొత్త రాజకీయమే చేస్తానని నిన్నటి దాకా చెబుతూ వచ్చారు. విమర్శలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు, పాలకుల వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అంటూ మాట్లాడిన పవన్ చంద్రబాబు దిగిపోయి జగన్ రాగానే రోడ్డు మీదకు వచ్చేశారు. రోడ్ల మీద ఆందోళనలు చేస్తే జనాలకు ఇబ్బంది అన్న ఆయనే విశాఖ లాంగ్ మార్చ్ పేరిట ఒక రోజంతా నగరవాసులను ఇబ్బంది పెట్టారు. మరి సమస్యలపైన పాలకులని కలసి మాట్లాడిన తరువాతనే చివరి అస్త్రంగా పోరాటం ఉండాలన్న పవన్ ఇపుడు మొదటి అడుగే ఆందోళన అంటున్నారు. పైగా గత అయిదేళ్లలో పవన్ కూడా ఎన్నో చెప్పారు, ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రం అన్నారు. చివరకు ఆయన కూడా లాంగ్ మార్చ్ ల పేరిట రాజకీయాలే చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
నిర్మాణాత్మక విపక్షం కావాలి….
రాజకీయాలకు అతీతంగా స్పందించే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు ఏపీలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం తగదని కూడా హితవు చెబుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన వల్ల తప్పేమీ లేదని కూడా మాట్లాడిన ఉండవల్లి అంతా రాష్ట్రం బాగు కోసం ఆలోచన చేయాలని, సమిష్టిగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు. ఒక్క ఉండవల్లి మాత్రమే కాదు, అయిదు కోట్ల ప్రజలందని ఆలోచన కూడా ఇదే. మరి మన నేతల చెవిన ఈ మాటలు పడతాయా. చూడాలి.