బీజేపీ బలం.. బలగం అదే?
భారతీయ జనతా పార్టీకి ఒక పద్ధతి ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం ఉంది. అందుకే ఆపార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ [more]
భారతీయ జనతా పార్టీకి ఒక పద్ధతి ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం ఉంది. అందుకే ఆపార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ [more]
భారతీయ జనతా పార్టీకి ఒక పద్ధతి ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం ఉంది. అందుకే ఆపార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ బలంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో కాషాయజెండా రెపరపెపలాడటానికి బలం క్యాడరే. అయితే ఇతర పార్టీల్లో లభించని గుర్తింపు బీజేపీలో లభిస్తుండటంతో ఎక్కువ మంది ఆ పార్టీ వైపునకు మొగ్గుచూపుతున్నారు. ఎంత పెద్ద పోస్టులోనైనా బీజేపీ కిందిస్థాయి కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వడం ఆ పార్టీకి కలసి వచ్చే అంశమని చెప్పొచ్చు.
పదవికి ఎంపికలో…
సాధారణంగా రాజ్యసభ పదవి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారికి ఇస్తారు. కానీ బీజేపీ రూటు వేరు. పార్టీ కోసం పనిచేసిన వారికి రాజ్యసభ పదవి ఇస్తుండటం ఈ మధ్య కాలంలో బీజేపీలో ఎక్కువగా కన్పిస్తుంది. కర్ణాటకలో ఇటీవల రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసిన తీరును చూసి సొంత పార్టీ కార్యకర్తలే ముక్కున వేలేసకున్నారు. ఎవరూ ఊహించని వ్యక్తికి రాజ్యసభ పదవి లభించడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.
సామాన్యులకు అవకాశం…..
ఈ ఏడాది జూన్ లో అశోక్ గస్తీ, ఈరణ్ణలను బీజేపీ అధిష్టానం రాజ్యసభకు ఎంపిక చేసింది. వీరిద్దరూ పార్టీ కోసం తొలి నుంచి కష్టపడుతున్న వారే. అయితే వీరిలో అశోక్ గస్తీ ఇటీవల కరోనా తో మరణించడంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించాల్సి వచ్చింది. పార్టీ రాష్ట్ర నేతలు అశోక్ గస్తీ భార్య సుమా గస్తీ, మాజీ ఎమ్మెల్యే శంకరప్ప, మాజీ ఎమ్మెల్యే సురానా పేర్లతో కూడిన జాబితాను కేంద్ర నాయకత్వానికి పంపింది.
ఆర్ఎస్ఎస్ సిఫార్సుతో….
కానీ ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అధిష్టానం మంగుళూరుకు చెందిన కె.నారాయణ్ ను రాజ్యసభ పదవికి ఎంపిక చేసింది. నారాయణ్ పారిశ్రామిక వేత్త అయినా ఆయన ఆర్ఎస్ఎస్ లో దీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్ సిఫార్సుతోనే నారాయణ్ ను ఎంపిక చేసినా పార్టీ కోసం శ్రమించిన నారాయణ్ ను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందుకే బీజేపీలో పదవుల పంపకం విషయంలో ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు