Thu Apr 25 2024 17:35:18 GMT+0000 (Coordinated Universal Time)
వంతెన అదిరింది
జగన్ పాదయాత్ర రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెనకు చేరుకుంది. వేల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు వైసీపీ అధినేత జగన్ కు స్వాగతం పలికారు. సుమారు 4.1 కిలోమీటర్లున్న ఈ వంతెన పూర్తిగా కార్యకర్తలు, జగన్ అభిమానులతో నిండిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలి వచ్చారు. జగన్ వారధి వద్దకు చేరుకోగానే గోదావరి నదిలో 1600 మంది మత్స్యకారులు 600 పడవలతో ర్యాలీ చేసి సంఘీభావాన్ని ప్రకటించారు. జనస్పందన అనూహ్యంగా రావడంతో వైసీపీ నేతల్లో ఆనందం పెల్లుబుకుతోంది. 150 మంది వైసీపీ జెండా రంగులతో కట్టిన చీరలతో అలరించారు. 150 గుమ్మడి కాయలతో జగన్ కు హారతులు ఇచ్చారు.
Next Story