ఏడాదిగా ఏమీ బాగా లేదట.. అందుకే ఇలా?
జగన్ అధికారంలోకి రావడమే అతి పెద్ద ప్రమాదం అని ఏపీలోని విపక్షాలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గత ఏడాదిన్నరగా గగ్గోలే పెడుతూ వస్తున్నాయి. నిజమే జగన్ [more]
జగన్ అధికారంలోకి రావడమే అతి పెద్ద ప్రమాదం అని ఏపీలోని విపక్షాలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గత ఏడాదిన్నరగా గగ్గోలే పెడుతూ వస్తున్నాయి. నిజమే జగన్ [more]
జగన్ అధికారంలోకి రావడమే అతి పెద్ద ప్రమాదం అని ఏపీలోని విపక్షాలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గత ఏడాదిన్నరగా గగ్గోలే పెడుతూ వస్తున్నాయి. నిజమే జగన్ చేతిలోకి అధికారం రావడం ప్రమాదమే అని చంద్రబాబుకు బాగా ఇపుడు అర్ధమైంది. ఆయన కలలు, భవిష్యత్తు అన్నీ కూడా జగన్ యధేచ్చగా విద్వంసం చేస్తున్నాడు. అది బాబు బాధ, దానిని ఇపుడు జనం బాధగా మార్చడంలోనే బాబు స్పెషాలిటీ ఉంది. తమ్ముళ్ళు అయితే ఏపీకి గత ఏడాదిగా ఏమీ బాగులేదని అపుడే ఏడుపు గొంతులు వినిపిస్తున్నారు. ఏపీలో ఎటు చూసినా ప్రమాదాలేనట. అన్నింటికీ మించి కరోనా గురించి ఎపుడైనా విన్నామా, కన్నామా అంటూ తమ్ముళ్ళు నోళ్ళు నొక్కుకుంటున్నారు.
వరసగా…..
అదేంటో గత నాలుగైదు నెలలుగా ఏపీలో మరీ దారుణంగానే ఉంది. విశాఖ వరస ప్రమాదాలతో వార్తల్లో ఉంది. ఇప్పటికి అరడజన్ కి పైగా ప్రమాదాలు విశాఖలో చోటు చేసుకున్నాయి. వాటి ద్వారా పాతిక మంది వరకూ చనిపోయారు. మరో వైపు ఇపుడు విజయవాడలో కూడా అతి పెద్ద ప్రమాదం నమోదు అయింది. ఏకంగా పది మంది చనిపోయారు. కరోనా ఆసుపత్రిగా ఉన్న చోట ఇది జరగడంతో ప్రభుత్వానికి చెడ్డపేరే వచ్చింది. నిర్లక్ష్యంగా పాలన ఉందని కూడా విపక్షాలు గట్టిగా నోరు చేసుకుంటున్నాయి. ఇలా ప్రమాదాలపైన ప్రధాని మోడీ సీఎం జగన్ తో మాట్లాడం కూడా ఇది రెండవ సారి. అంటే జాతీయ స్థాయిలోనూ ఏపీ తరచుగా వార్తలకెక్కుతోంది.
కరోనా కూడానా….
రోజులు బాగాలేకపోతే తాడే పాము అయి కరుస్తుందని అంటారు. జగన్ విషయంలో అదే జరుగుతుందేమో. లేకపోతే ప్రపంచాన్న్ని వణికించే కరోనా కూడా జగన్ వల్లనేనని ఏపీలో తమ్ముళ్ళు విమర్శలు చేస్తున్నారంటే ఏమనాలి, ఏపీలో చాలా తక్కువగా కరోనా కేసులు ఉన్న వేళ కూడా టీడీపీ బాబోయ్ ఏదో జరిగిపోతోంది అని రచ్చ రచ్చ చేసింది. ఇపుడు రెండున్నర లక్షలకు కేసులు చేరుకుని అదే జరుగుతోంది. శుభం పలకరా అంటే అదేదో అన్నట్లుగా ప్రభుత్వం మీద విమర్శలు చేయాలనుకుని అపశకునాలు పలికితే ఇలా జరిగిందని టీడీపీ మీద కూడా రివర్స్ లో కౌంటర్లు పడుతున్నాయి.
సీరియస్ నెస్ లేదా …?
ఇదిలా ఉండగా ఏపీ సీఎం జగన్ అధికారుల విషయంలో చాలా ఉదారంగా ఉంటారని చెబుతారు. ఆయన కఠినంగా మాట్లాడరు, బాధ్యతలు కూడా వారికే అప్పగించి నమ్ముతారు. అదే ఇపుడు కొంప ముంచుతోంది అని అంటున్నారు. ఏపీలో అందరూ కాకపోయినా చాలా మంది అధికారులు దీన్ని అవకాశంగా తీసుకుని నిర్లక్ష్యంగా ఉంటున్నారని, ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని చెబుతున్నారు. విజయవాడ ప్రమాదాన్ని కచ్చితంగా ఆ కోణంలోనే చూడాలి. ఇక ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో నెలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నా అధికారులు కొందరు ఇష్టారాజ్యంగా చేతివాటం చూపించడంతో ప్రజలకు మేలు జరగడంలేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా వైద్యాన్ని అప్పగించడంలో కూడా నిబంధనలు చూడకపోవడం వల్లనే విజయవాడ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. జగన్ కేవలం సమీక్షలతో సరిపెట్టకుండా తన మంత్రుల ద్వారా ఎప్పటికపుడు పరిస్థితుల మీద క్రాస్ చెకింగ్ చేయించాలని, బాధ్యులను గుర్తించి కఠినంగా వ్యవహరించాలి కోరుతున్నారు. లేకపోతే చివరికి ప్రభుత్వమే చెడ్డ పేరు తెచ్చుకుని ఇబ్బందులో పడడం ఖాయం.