పొలిటికల్ హానీమూన్ కు బ్రేక్
ప్రతిపక్షాలు తనకు సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జగన్ మాత్రం గత నాలుగు నెలలుగా పొలిటికల్ సైలెన్స్ పాటించారు. ఆయన మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినది [more]
ప్రతిపక్షాలు తనకు సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జగన్ మాత్రం గత నాలుగు నెలలుగా పొలిటికల్ సైలెన్స్ పాటించారు. ఆయన మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినది [more]
ప్రతిపక్షాలు తనకు సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జగన్ మాత్రం గత నాలుగు నెలలుగా పొలిటికల్ సైలెన్స్ పాటించారు. ఆయన మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినది లగాయితూ పాలన గురించి తప్ప మరెక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓ విధంగా హుందా రాజకీయాలనే జగన్ వైపు నుంచి నడిపారనుకోవాలి. అదే సమయంలో ప్రతిపక్షాలు మాత్రం గీత దాటేశాయి. ఒక్కో పార్టీ కూడా తాము చెప్పిన మాటకు కట్టుబడకుండా జగన్ మీద విమర్శలు చేయడానికి రెడీ అయిపోయాయి. దానికి అవి చెప్పిన కారణాలు చాలా సిల్లీగా కూడా ఉన్నాయి. ఏపీలో వైసీపీ సర్కార్ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అందువల్లనే పెదవి విప్పాల్సివచ్చిందని కవరింగ్ ఇచ్చుకుంటూ తమ రాజకీయ పోరాటాన్ని మొదలెట్టేశాయి. ప్రజల గురించి అని చెప్పుకున్నా కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు దగ్గర నుంచి ప్రతీ నాయకుడూ కూడా ఏం మాట్లాడారు, అందులో వారి అక్కసు ఎంత, వారి రాజకీయ మైలేజ్ ఎంత అన్నది జనం గమనిస్తూనే ఉన్నారు.
మొదటిసారి జగన్….
ఎన్నికల ప్రచారం ఏప్రిల్ 9న ముగించిన జగన్ ఆ తరువాత పెద్దగా చంద్రబాబు గురించి బయట మాట్లాడింది లేదు. అసెంబ్లీలో మాత్రం ఇద్దరు నేతలు కౌంటర్లేసుకున్నారు. ఇక నాలుగు నెలల పాటు ఇలా సహనం పాటించిన జగన్ ఏలూరులో జరిగిన వైఎస్సార్ వాహనమిత్ర కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాత్రం మనసులో మాటను బయటపెట్టేశారు. ప్రజలకే తన విన్నపం చేస్తూ తాను పాలన గురించి ఆలోచిస్తూంటే తనని విమర్శించడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి వేళ మొత్తం మద్యం దుకాణాలు బంద్ చేయిస్తే మద్యం అమ్మకాలు జరిగాయంటూ బాబు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను అధికారంలోకి వచ్చాక మొత్తం బెల్ట్ షాపులు ఎత్తివేయించానని, మద్యం దుకాణాలను కూడా బాగా తగ్గించానని జగన్ చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో మరింతగా వాటిని కుదించి చివరకు పూర్తిగా రద్దుచేస్తామని కూడా ప్రకటించారు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఇలా ఉంటే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని, జనం గమనించాలని జగన్ కోరడం విశేషం.
ఇక మళ్లీ సమరమే….
జగన్ సీఎం అయ్యాక మొదటిసారిగా ఇంత గట్టిగా చంద్రబాబు గురించి మాట్లాడారు. ఇక ఇది ఆరంభంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం చేస్తున్నదేంటి, విపక్షం సంగతేంటి అన్న దాని మీద సమరనాదమే చేస్తారని అంటున్నారు. జగన్ కూడా ఇపుడు రాజకీయం చేయడానికి రెడీ అవుతున్నారని చెబుతున్నారు. మిన్నకుంటే చంద్రబాబు అన్న మాటలే జనంలోకి పొతాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ నోరు విప్పుతున్నారని అంటున్నారు. రానున్నవి స్థానిక ఎన్నికలు కూడా కావడంతో జగన్ ఇక చంద్రబాబు మీద వీరలెవెల్లో విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి జగన్ పొలిటికల్ హానీమూన్ కి తానే బ్రేక్ వేశాడని చెప్పాలి.