కొత్త ఏడాది జగన్ ఆ నిర్ణయం తీసుకుంటారా?
ఈ మధ్య జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడం అతి పెద్ద చర్చనీయాంశం అయింది. ఏపీలో బంపర్ మెజారిటీతో ఉన్న వైసీపీ తెలంగాణాలో కూడా [more]
ఈ మధ్య జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడం అతి పెద్ద చర్చనీయాంశం అయింది. ఏపీలో బంపర్ మెజారిటీతో ఉన్న వైసీపీ తెలంగాణాలో కూడా [more]
ఈ మధ్య జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడం అతి పెద్ద చర్చనీయాంశం అయింది. ఏపీలో బంపర్ మెజారిటీతో ఉన్న వైసీపీ తెలంగాణాలో కూడా పోటీ చేయవచ్చు కదా అన్న బాధ అభిమానుల్లో కూడా ఉంది. ఇక సీమాంధ్రవారే అధికంగా ఉన్న యాభైకి పైగా ఉన్న డివిజన్లలో పోటీ చేసినా వైసీపీ సత్తా చాటుకోవడం ఖాయం కదా అన్న రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. పైగా వైఎస్సార్, జగన్ ఇద్దరి మీద తెలంగాణా ప్రజలకు విపరీతమైన అభిమానాలు ఉన్నాయి. దాన్ని క్యాష్ చేసుకోవడానికైనా జగన్ పోటీకి దిగాల్సిందే అన్న వారూ ఉన్నారు.
అదను కాదనే అలా…
జగన్ రాజకీయంగా పెద్దాలోచనలే చేస్తారు అన్నది 2019 ఫలితాల తరువాతనే చంద్రబాబు సహా చాలా పెద్ద బుర్రలకు అర్ధమైంది. జగన్ తెలంగాణాలో పోటీ చేయడాన్ని 2014లోనే వదిలేశారు. అప్పట్లో మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వచ్చాయి. ఆ తరువాత జగన్ ఆ వైపు చూడలేదు. దానికి కారణం కేసీయార్ తో రాజకీయ స్నేహం అనివార్యత ఒకటి ఉండగా, ఏపీలో వైసీపీకి అధికారంలోకి తేవడం అన్న బృహత్తర కార్యక్రమం భుజాల మీద ఉండడం మరో కారణం. అందుకే జగన్ తెలంగాణా ఊసే లేకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు.
టీడీపీ ఖాళీ….
ఇక కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అన్నది జగన్ థియరీ. అరకొర సీట్లు, కార్పోరేటర్లను గెలిపించుకున్నా కూడా చివరికి వారు మిగలరు. జంపింగ్ చేసి టీయారెస్ గూట్లోకి వెళ్ళిపోతారు. ఆ మాత్రం సౌభాగ్యాన్నికి పోటీ చేసి పరువు తీసుకోవడం ఎందుకు అన్నదే జగన్ ఆలోచనట. ఇక 2014 తరువాత వరసగా జరిగిన అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గ్రేటర్ ఎన్నికల నాటికి టీడీపీ గుండు సున్నా అనిపించుకుంది. ఇక కాంగ్రెస్ కూడా కుదేల్ అయింది. బీజేపీయే ఇపుడు ఆముదపు వృక్షంగా రాజకీయ జీవులకు కనిపిస్తోంది. అందుకే ఇపుడే తెలంగాణాలో రీ ఎంట్రీకి సరైన సమయం అని జగన్ భావిస్తున్నారుట.
స్పేస్ ఉందిగా….?
తెలంగాణా రాజకీయ ముఖ చిత్రం ఇపుడు క్లియర్ గా ఉంది. తెలంగాణాను నేనే తెచ్చాను, టీయారెస్ కి ఓటేయని వాడు తెలంగాణావాది కానే కాడు అన్న కేసీయార్ ఎమోషనల్ స్పీచ్ లకు కాలం చెల్లింది. ఇక కేసీయార్ ని ఆయన టీయారెస్ ని కూడా అన్ని పార్టీల మాదిరిగానే జనం చూస్తున్నారు. మోజు కూడా బాగా తగ్గింది. మరో వైపు తీసుకుంటే కేసీయార్ తో జగన్ కి మునుపటి అనుబంధాలు, రాజకీయ మొహమాటాలూ ఇపుడు లేవు. అందువల్ల హ్యాపీగా అక్కడ పోటీ చేయవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నమెజారిటీ రెడ్లు జగన్ ని పిలుస్తున్నారు. వైసీపీని యాక్టివ్ చేయమంటున్నారు. అలాగే తెలంగాణావ్యాప్తంగా రెడ్లు సామాజికవర్గం పరంగా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక వైఎస్సార్ అభిమానులకు లోటు లేదు. జగన్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాల ప్రభావం తెలంగాణాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద ఉంటుందని జగన్ బలంగా నమ్ముతున్నారుట. దీంతో ఈ సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయితే తెలంగాణాలో పాగా వేయడం ఖాయమని అంటున్నారు. మరో వైపు బీజేపీ, టీయారెస్ లోకి వెళ్ళని రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారికి వైసీపీ ఒక వేదిక అవుతుంది అంటున్నారు. దాంతో కొత్త ఏడాది తెలంగాణాలో కొత్త రాజకీయానికి జగన్ తెర తీస్తారని అంటున్నారు.