ఫ్యాన్ ని గిర్రున తిప్పేసిన జగన్ ?
సరిగ్గా సరైన సమయంలో ఫ్యాన్ స్పీడ్ పెరిగింది. శీతాకాలంలో యమ జోరుగా మూడు రెక్కలూ తిరిగేస్తున్నాయి. ప్రతిపక్షం గుండెల్లో చలి పుట్టించేస్తున్నాయి. ఈ మొత్తం రాజకీయానికి మాస్టర్ [more]
సరిగ్గా సరైన సమయంలో ఫ్యాన్ స్పీడ్ పెరిగింది. శీతాకాలంలో యమ జోరుగా మూడు రెక్కలూ తిరిగేస్తున్నాయి. ప్రతిపక్షం గుండెల్లో చలి పుట్టించేస్తున్నాయి. ఈ మొత్తం రాజకీయానికి మాస్టర్ [more]
సరిగ్గా సరైన సమయంలో ఫ్యాన్ స్పీడ్ పెరిగింది. శీతాకాలంలో యమ జోరుగా మూడు రెక్కలూ తిరిగేస్తున్నాయి. ప్రతిపక్షం గుండెల్లో చలి పుట్టించేస్తున్నాయి. ఈ మొత్తం రాజకీయానికి మాస్టర్ ప్లాన్ మాత్రం జగన్ దే. జగన్ కి ప్రభుత్వంలోకి వచ్చాక పార్టీ మీద శ్రద్ధ తగ్గిందని అంతా అనుకుంటున్న వేళ, ఆరోపణలు కూడా వెల్లువగా వస్తున్న నేపధ్యంలో జగన్ మొత్తం పార్టీ శ్రేణులను కదిలించే ప్రయత్నం మొదలుపెట్టారు. పాదయాత్రకు మూడేళ్ళు అంటూ అక్టోబర్ ఆరున వైసీపీ ఇచ్చిన పార్టీ ప్రొగ్రాం సూపర్ సక్సెస్ అయింది. అలా శ్రేణులన్నీ మెల్లగా జనంలోకి వచ్చాయి. అది అలా ఉండగానే జగన్ పుట్టిన రోజు వేడుకలు అంటూ డిసెంబర్ నెల మొదటి నుంచే మరో కొత్త సందడితో పార్టీని రీఛార్జి చేశారు. ఇపుడు ఇళ్ళ పట్టాల పండుగ అంటూ పదిహేను రోజుల కార్యక్రమంతో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోనీయకుండా జగన్ ఒక్క దెబ్బకు బిజీ చేసి పారేశారు.
ఫుల్ జోష్ తో…..
కొత్త ఏడాది వరసగా ఎన్నికలు రాబోతున్నాయి. ఇపుడే పార్టీ పట్టాలెక్కాల్సిన సమయం, సందర్భం. అందుకే వీలూ వాలూ చూసి మరీ ఫ్యాన్ స్పీడ్ జగన్ పెంచేశారు అంటున్నారు. ఎటు చూసినా ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతల సందడే కనిపిస్తోంది. ఏ జిల్లాలో చూసినా జనంలో నాయకులు, కార్యకర్తలు కలియతిరుగుతూ మమేకం అవుతున్నారు. టీడీపీ చేష్టలుడిగి చూస్తున్న వేళ బీజేపీ మీడియా బేబీగా మారిపోయిన వేళ వైసీపీ పొలిటికల్ మైదానంలో ఒక్కటిగా నిలబడి ఆడుతున్న ఆట కొత్త ఏడాది సరికొత్త విజయాలను అందిస్తుందనే అంటున్నారు.
పక్కా ప్లాన్ తోనే…..
స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జనంలోకి వెళ్ళి చెప్పుకోవడానికి సరిపడా సరంజామాను జగన్ సిద్ధం చేసి ఉంచారు. ఇపుడు క్యాడర్ ని లీడర్ ని తట్టి లేపి కార్యక్షేత్రంలోకి పంపిస్తున్నారు. పధకాలూ ఫలితాలు అందుకుంటున్న లబ్దిదారులలో హుషార్ తగ్గకుండా చేసేందుకు పార్టీని రైట్ టైం లో రంగంలోకి జగన్ దించడం ద్వారా పక్కాగానే ప్లాన్ అమలు చేస్తున్నారు అంటున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలబడిన అభ్యర్ధులు అంతా ఇది తమ గురుతర బాధ్యతగా భావించి మరీ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.
సీక్రెట్ అదే కదా…?
విపక్షాలు వేయి మాటలు అనవచ్చు గాక కానీ నోట్లో బూరె ముక్క పెట్టేది మాత్రం వైసీపీయే కదా. అధికారం చేతిలో ఉంది, ఏం చేయాలన్నా చేయగలమని నిరూపించుకునే నాయకత్వం ఉంది. దాంతో జనాల్లోకి ఉత్సాహంగా ఇపుడు పార్టీ పరుగులు తీస్తోంది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న క్యాడర్ కూడా స్థానిక ఎన్నికల వేళకు రెడీ అవడం కూడా కలసివచ్చే పరిణామంగానే చూడాలి. విపక్షాలు ఊకదంపుడు విమర్శలకే పరిమితం అయిన చోట వైసీపీ మాటలు కాదు మావి చేతలూ అంటూ వెలిగిపోవడమంటే నిజంగా ఫ్యాన్ పార్టీకి గత ఏడాది సక్సెస్ రిపీట్ చేయడానికి తగిన బలం దక్కినట్లే కదా. ఎపుడేం చేయాలో సరిగ్గా చూసి మరీ చేస్తున్న అధినేత జగన్ వైసీపీకి ఇపుడు తిరుగులేని బూస్టింగునే ఇచ్చేశారు. ఇక ఈ రేసులో మనదే గెలుపు అనుకుంటూ పార్టీ శ్రేణులు దూకుడుగా సాగిపోతున్నాయంతే.