ముట్టుకుంటే వదులుతారా?
జగన్ కి విశాఖ మోజు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయన ఏ ముహూర్తాన విశాఖను పరిపాలనా రాజధాని అని అన్నారో కానీ నాటి నుంచి విశాఖ మీద మనసు [more]
జగన్ కి విశాఖ మోజు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయన ఏ ముహూర్తాన విశాఖను పరిపాలనా రాజధాని అని అన్నారో కానీ నాటి నుంచి విశాఖ మీద మనసు [more]
జగన్ కి విశాఖ మోజు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయన ఏ ముహూర్తాన విశాఖను పరిపాలనా రాజధాని అని అన్నారో కానీ నాటి నుంచి విశాఖ మీద మనసు పారేసుకున్నారు. ఆఘమేఘాల మీద మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీ ఆమోదించినా శాసనమండలిలో దానికి బ్రేకులు పడ్డాయి. అయితే మండలినే ఏకంగా రద్దు చేసిన జగన్ ఇపుడు బిల్లుల విషయంలో మరింత సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. వీలైతే మరో మారు అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టాలన్న దాని మీద కూడా న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లుగా భోగట్టా.
అవసరమే లేదా..?
మరో వైపు న్యాయ నిపుణులు కొందరు రాజధానుల పేరిట బిల్లులను కొత్తగా ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని సూచించినట్లుగా తెలుస్తోంది. వారి సూచనన మేరకే జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ రాజ్యాంగంలో రాజధాని అన్న పదమే లేదని చెప్పుకొచ్చారు. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తే అదే రాజధాని అవుతుందని కూడా ఆయన అంటున్నారు. దాంతో అసెంబ్లీలో బిల్లుల సంగతి ఎలా ఉన్నా ముందుకు అడుగులు వేయాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
ఉగాదికి విశాఖకు…
ఇక, ముఖ్యమంత్రి జగన్ అనుకున్న విధంగానే ముందుకు సాగుతున్నారు. విశాఖను పాలనారాజధాని చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలుగు వారికి కొత్త ఏడాదిగా భావించే ఉగాది నుంచి విశాఖలో ముఖ్యమంత్రి జగన్ కార్యకలాపాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. విశాఖలోనే ముఖ్యమంత్రి నివాసంతో పాటు, ఆయన కార్యాలయం కూడా ఉంటాయి. ఈ మేరకు దానికి సంబంధించిన పనులు చకచకా సాగిపోతున్నాయి. దాంతో విశాఖను పాలనారాజధానిగా చేసుకుని ఉగాది నుంచి జగన్ ఇక్కడికి షిఫ్ట్ అవుతారని అధికార పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న మాట.
మూడు మారదుట…..
ఇక మూడు రాజధానులు, పాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులు శాసనమండలిలో ఉన్నా కూడా జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. జగన్ విశాఖ రాజధాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గరని అంటున్నారు. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా గట్టిగానే చెప్పారు. విశాఖ రాజధాని అవడం ఖాయమని, కాకపోతే కొంత లేట్ అవుతుందని ఆయన అంటున్నారు. ఇక విశాఖ నుంచే పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు. ఉగాది వేళ ఈ కార్యక్రమానికి విశాఖలో శ్రీకారం చుట్టడం ద్వారా పాలనా రాజధానిని అలా అనధికారికంగా ప్రకటించేస్తారన్న మాట.