పార్టీని మించేసిన జగన్
పార్టీ, ప్రభుత్వ సారధి ఒకరు కావడం ప్రాంతీయ పార్టీల రాజకీయాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు రాజకీయ ఊపిరి తక్కువ. వారి పరిధి కూడా తక్కువ. [more]
పార్టీ, ప్రభుత్వ సారధి ఒకరు కావడం ప్రాంతీయ పార్టీల రాజకీయాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు రాజకీయ ఊపిరి తక్కువ. వారి పరిధి కూడా తక్కువ. [more]
పార్టీ, ప్రభుత్వ సారధి ఒకరు కావడం ప్రాంతీయ పార్టీల రాజకీయాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు రాజకీయ ఊపిరి తక్కువ. వారి పరిధి కూడా తక్కువ. పైగా పెత్తనం ఒకే చోట కేంద్రీకృతం కాకపోతే పార్టీ ముక్కచెక్కలు అయ్యే ప్రమాదం ఉంది. దానికి అనేక ఉదాహరణలు కూడా కళ్ళముందు ఉన్నాయి. ఇక ప్రభుత్వం, పార్టీ ఈ రెండింటినీ ఒంటిచేత్తో నడపడం అన్నది కష్టసాధ్యమైన విషయం. పార్టీని ప్రభుత్వం శాసించడమో ప్రభుత్వమే పార్టీని నియంత్రించడమో జరిగిపోతాయి. చంద్రబాబు లాంటి ఉద్దండుడు కూడా ఈ రెండింటి మీద ఏకకాలంలో సవారి చేయలేక చేతులెత్తేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి.
సుప్రీం ఎవరు…?
ఇదిలా ఉండగా పార్టీ, ప్రభుత్వంలో సుప్రీం ఎవరు అంటే పార్టీయేనన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే పార్టీ లేకపోతే ప్రభుత్వం అన్నదే ఉండదు కాబట్టి. పార్టీని పటిష్టంగా ఉంచుకుంటే పదికాలాల పాటు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి. జగన్ విషయానికి వస్తే ఆయన పార్టీకి సుప్రీం. ఇటు ప్రభుత్వానికి కూడా అధినేత. జగన్ ముఖ్యమంత్రిగా మంచి మార్కులే తెచ్చుకుంటున్నా పార్టీ అధినేతగా మాత్రం విఫలం అయ్యారని కామెంట్స్ వస్తున్నాయి. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు పార్టీ ముందుకు పరుగులు తీసింది. జగన్ సైతం పార్టీని రీఛార్జ్ చేస్తూ ఎప్పటికపుడు కార్యక్రమాలు ప్రకటించేవారు. దాంతో క్యాడర్లో ఉత్సాహం ఉరకలు వేసేది. ఇపుడు పార్టీని పక్కనపెట్టేసిన పుణ్యం జగన్ దేనని అంతా గట్టిగా చెబుతున్నారు.
పార్టీ లైన్ దాటేశారా…?
ఏ ప్రభుత్వమైనా పార్టీ అజెండా మేరకు పనిచేస్తుంది. ప్రభుత్వాన్ని అలా పనిచేయించడానికి పార్టీ అత్యున్నత కమిటీ కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలో తరచూ పార్టీ సుప్రీం బాడీ సమావేశమై ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది. పార్టీ లైన్ లోనే సాగుతోందా అన్న దాని మీద సమీక్షలు నిర్వహిస్తారు. అయితే జగన్ పార్టీ వైసీపీ విషయంలో అలాంటివేమీ లేవని అంటున్నారు. ఇప్పటివరకూ పార్టీ అత్యున్నత వేదిక అయిన రాజకీయ వ్యవహారాల కమిటీ సైతం సమావేశం కాలేదని గుర్తు చేస్తున్నారు. పార్టీ అంటే జగన్ ఒక్కడేనన్న భావనతో నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అసంతృప్తి కూడా ఉంది.
నామ్ కే వాస్తే పదవులు….
పేరుకు పీఏసీ మెంబర్లు, రాష్ట్ర స్థాయి కార్యదర్శులు ఉపాధ్యక్షులు ఉన్నా కూడా ఎవరినీ పిలిచి జగన్ సంప్రదిస్తున్న దాఖాలాలు లేవు. దాంతో పార్టీ మీద నుంచే ప్రభుత్వం పరుగులు తీస్తోంది. దీంతో పార్టీగా జగన్ విధానాలను జనంలోకి తీసుకుపోయే యంత్రాంగం పూర్తిగా పడకేస్తోంది. ఇది మంచి విధానం కాదని పార్టీ సీనియర్లు అంటున్నారు. రేపటి రోజున జరిగే స్థానిక ఎన్నికల్లో పార్టీ అవసరం మళ్ళీ పడుతుందని, అపుడు నీరసించిన క్యాడర్ని ముందు పెట్టుకుని విజయం సాధించాలంటే కుదిరే పని కాదని అంటున్నారు. కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా వైసీపీ అత్యున్నత వేదిక సమావేశమై ప్రభుత తీరుని సమీక్ష చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సలహా ఇస్తున్నారు. మరి జగన్ వింటారో లేదో.