జగన్ డిజైనింగ్.. సోషల్ ఇంజనీరింగూ… ఇది చాలదూ?
జగన్ ని టీడీపీ తుగ్లక్ అనేసింది. కొన్ని పార్టీలు తిక్క కూడా అంటూ నిందించాయి. అయితే ఎవరెలా అనుకున్నా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ డైలాగ్ చెప్పినట్లు [more]
జగన్ ని టీడీపీ తుగ్లక్ అనేసింది. కొన్ని పార్టీలు తిక్క కూడా అంటూ నిందించాయి. అయితే ఎవరెలా అనుకున్నా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ డైలాగ్ చెప్పినట్లు [more]
జగన్ ని టీడీపీ తుగ్లక్ అనేసింది. కొన్ని పార్టీలు తిక్క కూడా అంటూ నిందించాయి. అయితే ఎవరెలా అనుకున్నా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ డైలాగ్ చెప్పినట్లు జగన్ తిక్కకు కూడా ఒక లెక్క ఉంది. ఆ లెక్క తప్పకుండా తాను అనుకున్న పని చేసుకుపోవడమే జగన్ పొలిటికల్ స్ట్రాటజీ. జగన్ ఏడాది పాలనను మిడిమిడి మీడియా కళ్ళతో, చదువరులు, రాజకీయాల గురించి ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్న వారి ఆలోచనలతో చూస్తే అబ్బే బాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ ని కోర్టు దాదాపు డెబ్బై సర్లు మొట్టికాయలు వేసింది. మూడు రాజధానులతో తలబొప్పి కట్టించుకున్నారు. టీటీడీ దేవాలయాల భూముల వేలం విషయంలో మరకలు పడ్డాయి. ఇక ప్రతీ దానికి యాగీ చేసే విపక్షాల వైపు నుంచి చూస్తే పెద్దగా మార్కులు పడవు. కానీ రెండో వైపు కూడా చూడాలి.
టార్గెట్ అదే….?
జగన్ ఇవేమీ పట్టించుకోవడంలేదు. తాను అనుకున్నది చకచకా చేసుకుంటూపోతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీ ఇంటికీ కనీసం లక్ష రూపాయల మేర వివిధ పధకల వల్ల లబ్ది కలిగింది. ఇది ఏ ఒక్క మీడియాలోనూ రావడంలేదు. నగదు బదిలీ ద్వారా జగన్ ప్రజలలో కొనుగోలు శక్తిని పెంచారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఏపీలో కరెన్సీ బాగానే కదిలింది. ఆయన పేదల వర్గాలపైన తన దృష్టిని నిలిపారు. వారిని ఆదుకుంటే చాలు తన లక్ష్యం పూర్తి అవుతుందని అంటున్నారు. ఏపీలో వారు కోటిన్నర దాకా అతి పెద్ద జనాభాగా ఉన్నారు.
రైతుల అజెండా…..
ఇక జగన్ రైతుల కోసం తన తండ్రి కంటే ఎక్కువ చేశాననిపించుకోవాలనుకుంటున్నారు. రైతుల కోసం ఆయన భరోసా పేరిట నగదుని నేరుగా ఇస్తున్నారు. ఇక వారి పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చూడడం. జనతా బజార్ కాన్సెప్ట్ ద్వారా మార్కెట్ సదుపాయం కల్పించడం ఇవన్నీ కూడా రైతులకు ఆనందాన్ని కలిగించేవే. ఇక నీటి పారుదల రంగం మీద కూడా జగన్ దృష్టి పెడుతున్నారు. దీని వల్ల వ్యవసాయానికి అతి పెద్ద సాయం అందుతుంది. అలాగే కరవు సీమగా ఉన్న రాయలసీమకు నీరు దక్కుతుంది. నాలుగేళ్ల కాలం పెట్టుకుని మరీ జగన్ నీటి ప్రాజెక్టుల పూర్తికి గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
ఇంట్లో చోటు…..
ఇక జగన్ సర్కార్ డిజైన్ చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలు ఒకసారి చూసుకుంటే అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని పరిగణనలోకి తీసుకున్నారు. ఎక్కడా ఎవరినీ వదలడంలేదు. విద్య, వైద్యం మీద జగన్ చూపుతున్న శ్రధ్ధ వల్ల ప్రతీ ఇంట్లో ఆయనకు చోటు తప్పకుండా దక్కుతుంది. పార్టీకి బలమైన పునాది పడుతుంది. వైసీపీకి కూడా గట్టి ఓటు బ్యాంక్ రూపొందుతుంది. పధకాలు పందేరాన్ని జగన్ సైలెంట్ గా చేసుకుపోవడం వెనక కారణం ఇదే. వాటిని అందుకున్న లబ్దిదారుల్లో సగం మంది తన వైపు చూసినా వైసీపీ మళ్ళీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. వైసీపీ కి రానున్న దశాబ్దాల కాలాలకు సరిపడా గట్టి ఓటు బ్యాంక్ నిర్మాణం జగన్ చేస్తున్నారు. ఇది అచ్చంగా అనాడు టీడీపీ అధినేత అన్న నందమూరి చేసిన సోషల్ ఇంజనీరింగ్. అదే ఈ రోజు వరకూ టీడీపీకి కాపాడింది. జగన్ కూడా అవే లెక్కలతో వెళ్తున్నారు. పక్కాగా వాటి ఫలితాలు వస్తాయని, వైసీపీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. మొత్తానికి జగన్ తిక్క వెనక ఉన్న లెక్కలు అదిరిపోలేదూ.