రెండు కీలక విషయాల్లో జగన్ వ్యూహం ఏంటి…?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు అనేక రూపాల్లో ప్రజలకు చేరువ అవుతున్నారు. కీలకమైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. [more]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు అనేక రూపాల్లో ప్రజలకు చేరువ అవుతున్నారు. కీలకమైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. [more]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు అనేక రూపాల్లో ప్రజలకు చేరువ అవుతున్నారు. కీలకమైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. వీటిలో కొన్ని ఆర్ధికంగాను, మరికొన్ని సంక్షేమం రూపంలోనూ ఉన్నాయి. అయితే, వీటిలో అత్యంత కీలకమైనవిగా రెండు విషయాలను జగన్ తీసుకున్నారు. ఒకటి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేసి.. ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టడం. రెండు… మూడు రాజధానుల ప్రతిపాదనను సాకారం చేయడం.
ఇంగ్లీష్ మీడియంపై…….
అయితే, ఈ రెండు విషయాలు కూడా హైకోర్టులో అనేక రూపాల్లో పిటిషన్లను ఎదుర్కొంటున్నాయి. తెలుగు మీడియం విషయంలో రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని హైకోర్టు పేర్కొంది. అయితే, ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించింది. అయినప్పటికీ.. కొందరు మాత్రం మళ్లీ కోర్టుకు వెళ్లారు. కానీ, ప్రభుత్వ వాదన మాత్రం పేదలకు ఇంగ్లీషు విద్య అందవద్దా ? అనేదే..!దీనికి సరైన సమాధానం ప్రతిపక్షం సహా ఎవరూ చెప్పే సాహసం చేయలేక పోయారు. ఏదో కొన్నాళ్లు హడా వుడి చేసినా తర్వాత విరమించుకున్నారు.
కోర్టుల్లో కేసులు….
కానీ, కోర్టుల్లో మాత్రం కేసులు నడుస్తున్నాయి. ఇక, తాజాగా ఈ విషయంపై మాట్లాడిన జగన్.. ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయంలో తాము ముందుకు సాగుతామని, 96 శాతం మంది ప్రజలు ఇంగ్లీషు మీడియంకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. దీనిని ఆసరా చేసుకుని సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఇక, మూడు రాజధానుల విషయం కూడా జగన్ సీరియస్గా పరిగణిస్తున్న విషయాల్లో కీలకమైన విషయంగానే చెప్పాలి. అయితే, దీనిపై కూడా అనేక పిటిషన్లు ఇప్పుడు కోర్టుల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడంపైనా కోర్టు ఆగ్రహంతో ఉంది.
రాజధానుల అంశంపైనా…?
అయినప్పటికీ.. మరోసారి దీనిపై చట్టం తీసుకురావడం ద్వారా మూడు రాజధానుల విషయంలో కీలకం గా ముందుకు సాగాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే జూలై 8 నాటికి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ప్రకటించేందుకు కూడా జగన్ సిద్దమయ్యారని తెలుస్తోంది. ఈ విషయం లోనూ అవసరమైతే.. ప్రజాభిప్రాయం దిశగా అడుగులు వేయాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు విషయాలనూ జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారని వైసీపీలోనూ చర్చసాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి సంచలన మార్పులు తీసుకురాగల ఈ నిర్ణయాలపై భారీ ఆశలు ఉన్నాయని అంటున్నారు.