జగన్ బాబును మరచిపోతేనే ?
జగన్ ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే బలవంతుడైన రాజకీయ నాయకుడు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే పార్టీ పరంగా చూసుకున్నా, నిన్నటి ఎన్నికల్లో సాధించిన ఓట్ల [more]
జగన్ ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే బలవంతుడైన రాజకీయ నాయకుడు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే పార్టీ పరంగా చూసుకున్నా, నిన్నటి ఎన్నికల్లో సాధించిన ఓట్ల [more]
జగన్ ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే బలవంతుడైన రాజకీయ నాయకుడు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే పార్టీ పరంగా చూసుకున్నా, నిన్నటి ఎన్నికల్లో సాధించిన ఓట్ల పరంగా చూసుకున్నా, సీట్ల విషయం చూసుకున్నా కూడా జగన్ గొప్ప స్థానంలోనే ఉన్నారు. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ ఉనికికి సైతం ముప్పు వాటిల్లేలా జనం తీర్పు ఇచ్చారు ఇంత జరిగాక జగన్ ఇంకా విపక్షం వైపు చూడడం, టార్గెట్ చేయడంలో ఎటువంటి అర్ధం లేదని విశ్లేషకులు అంటున్నారు. జగన్ ఏడాదిగా తన హామీలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉంటూనే చంద్రబాబుని కూడా కెలుకుతున్నారు. జనం మరచిన టీడీపీనికి బ్యానర్ హెడ్డింగులు పెట్టేలా ముందుకు తెస్తున్నారు.
పట్టింపు ఎందుకో…?
నిజానికి జనమే మరచిన టీడీపీని ముందుకు తేవాలన్న తపన ఆసక్తి జగన్ కి ఎందుకో అర్ధం కాదని అంటున్నారు. జగన్ ఏ పని చేసినా అందులో చంద్రబాబుని చూస్తున్నారు. ఆఖరుకు తన ఏడాది పాలనపైన మంచి చెప్పుకునే విషయంలో కూడా గత ప్రభుత్వం అంటూ మళ్ళీ జనాల ముందు బాబును పెడుతున్నారు. నిజానికి ఆ పోలికను జనం వేసుకునే జగన్ కి అవకాశం ఇచ్చారు. అయిదేళ్ళ పాటు చంద్రబాబు తమకు కావాల్సిన విధంగా పాలన చేయలేదనే జగన్ ని నెత్తిన పెట్టుకున్నారు. అయినా కూడా జగన్ బాబుని పదే పదే విమర్శించడం అంటే కోరి విపక్షానికి పాలు పోస్తున్నట్లే లెక్క.
ద్వేషం వద్దు…?
విద్వేషపూరిత రాజకీయాలు తమిళనాడులో ఒకప్పుడు ఉండేవి. ఇపుడు అక్కడ ఇద్దరు దిగ్గజ నేతలు మరణించాక మామూలుగానే అక్కడ కధ సాగుతోంది. కానీ ఖర్మ ఏంటి అంటే ఏపీకి ఆ చీడ అంటుంది. ఇక్కడ కూడా నాయకులు ముఖాముఖాలు చూసుకోలేని స్థితి ఉంది. జగన్ బాబుని విమర్శిస్తే ఆయన వయసు దృష్ట్యా సానుభూతి పొందే అవకాశమే ఎక్కువగా ఉంటుంది జగన్ కి రాజకీయాలు చేసుకోవడానికి వయసు ఎలా ప్లస్ అయిందో బాబుకు వ్రుధ్ధాప్యం కూడా అలాగే ప్లస్ అవుతోంది. దాన్ని మరింతగా అడ్వాంటేజిగా తీసుకుని బాబు సానుభూతి ఇంకా పొందేందుకు చూస్తారు. అందువల్ల జగన్ బాబుపైన బాణాలు వేయడం మానుకోవాలి. పైగా ఆయన హయాంలో పనిచేసిన అధికారుల్తో సఖ్యత లేకపోయినా ఫరవాలేదు కానీ గొడవలకు దిగడం, కులాల పేరిట దూషణలు అన్నీ చివరకు జగన్ కే చేటు తెస్తున్నాయని గ్రహించడం ఇకనైనా మంచిదేమో.
శ్రీరామ రక్ష….
ఏ పార్టీకైనా మంచి పాలన అన్నదే గీటు రాయిగా ఉంటుంది. మళ్లీ జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడగాలంటే అదే ప్రాతిపదిక అవుతుంది. జగన్ విషయం తీసుకుంటే ఆ ధీమా చాలానే ఉంది. ఆయన ఎన్నికల ప్రణాళికను ఏడాదిలోనే బాగానే అమలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఫలాలను అందిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన తాను చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్ట్ తో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, రాజధాని ఒకటి అయినా మూడు అయినా కూడా వాటి దశ దిశా ఈ నాలుగేళ్లలో చూపించడం కనుక చేస్తే 2024 ఎన్నికలకు దర్జాగా వెళ్ళిపోవచ్చు. అంతే తప్ప రాజ్యాంగ సంస్థలతో ప్రతీ రోజూ పేచీలు పెట్టుకుంటూ టీడీపీని టార్గెట్ చేసుకుంటూ పొద్దు పోనిస్తే ఎన్ని మంచి పనులుఎన్ని చేసినా కూడా ఇవే రేపు జనాలను ఆలోచింపచేస్తాయి.