ఫక్తు పొలిటికల్ లీడర్… పాలకుడు కాదట
ఇంటిపెద్ద పిల్లలకు తిండి, బట్ట పెడతాడు, వారి బాగోగులు అన్నీ చూస్తాడు, అంతటితో ఆగడు, ఆ కుటుంబానికి ఆర్ధిక భద్రత, మరింత మెరుగైన జీవితం కోసం అభివృధ్ధి [more]
ఇంటిపెద్ద పిల్లలకు తిండి, బట్ట పెడతాడు, వారి బాగోగులు అన్నీ చూస్తాడు, అంతటితో ఆగడు, ఆ కుటుంబానికి ఆర్ధిక భద్రత, మరింత మెరుగైన జీవితం కోసం అభివృధ్ధి [more]
ఇంటిపెద్ద పిల్లలకు తిండి, బట్ట పెడతాడు, వారి బాగోగులు అన్నీ చూస్తాడు, అంతటితో ఆగడు, ఆ కుటుంబానికి ఆర్ధిక భద్రత, మరింత మెరుగైన జీవితం కోసం అభివృధ్ధి చేసుకుంటూ పోతాడు. అంటే ఇక కుటుంబంలోనే ఇంత పెద్ద బాధ్యత ఉంటే అయిదున్నర కోట్ల జనాభా కలిగిన ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంకెంతలా ఆలోచనలు చేయాలి. తెల్లారిలేస్తే కొత్త పధకాలూ , జనాల ఖాతాలో సొమ్ములు పంచడాలు, ఇదే గత ఏడాదిగా సాగుతున్న కధ. నిజమే ఆర్తులను ఆదుకోవద్దని ఎవరూ చెప్పరు. రాష్ట్ర పెద్దగా పేదలకు సాయం చేయాల్సిందే. దానితో పాటుగా రాష్ట్రం ముందుకు పోవడానికి కూడా సమగ్ర కార్యాచరణ ముఖ్యమని మేధావులు అంటున్నారు.
ఇలా ఇచ్చుకుంటూ….
కొండలైనా తరిగిపోతాయి కూర్చుని తింటే అని సామెత ఉంది. ఏపీకి ఆదాయం కూడా పెద్దగా రావడంలేదు. అంత త్రీ టైర్ సిటీసే ఇక్కడ ఉన్నాయి. రాజధాని ఆదాయం లేదు, పరిశ్రమలు లేవు, వాణిజ్యరంగం అద్భుతంగా లేదు, ఎంత చూసినా వ్యవసాయ రంగమే ఆదుకోవాలి. సరే దానికి పెట్టుబడులు, మదుపు ప్రభుత్వం చూడాలి. కానీ అన్ని వర్గాల సంక్షేమం పేరిట ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఖర్చు చేసుకుంటూ పోతే రేపటి రోజు ఏంటి అన్నది ఆందోళనగా ఉంది. ఈ రోజు వచ్చిన దాన్ని ఇచ్చేస్తున్నారు, కానీ సంపదని సృష్టించకపోతే రేపటి రోజున డబ్బులు ఎలా వస్తాయి. ఇది మౌలికమైన ఆలోచనగా ఉండాలి కదా. అసలు రాష్ట్ర ఆర్ధిక స్థితి మీద ప్రభుత్వం సమీక్ష చేసి ఉండాల్సిన తరుణమిది.
పుణ్యకాలమే ….
తొలి ఏడాది తడబాట్లూ, తప్పటడుగులూ కామన్ అనుకున్నా అన్నీ కూడా పందేరాలే సాగాయి తప్ప నిఖార్సుగా ఇది ఒక అభివ్రుధ్ధి కార్యక్రమం అని చెప్పుకోవడానికి జగన్ సర్కార్ కి లేకుండా పోయింది. వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయి. అపుడు రాష్ట్రానికీ ఆదాయం వస్తుంది. పేదలకూ సాయం చేయాల్సిన భారం తప్పుతుంది. మరి ఈ దిశగా తొలి ఏడాది కనీసం ఆలోచనలు చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. దాంతో పుణ్యకాలం కాస్తా గడచిపోయిందని అంటున్నారు.
టార్గెట్ అలా….
ఇక ఇప్పటినుంచి అయినా సాగు నీటి ప్రాజెక్టులతో పాటు, పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య కార్యకలాపాలను పెంచే దిశగా ఆలోచనలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అంటున్నారు. జగన్ ఆలోచనలు రాజకీయ నాయకుడిగానే ఉన్నాయి తప్ప పాలకుడిగా ట్రాన్స్ ఫర్ కావడంలేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మంది సొమ్ముతో జనాలకు పందేరాలు ఇచ్చి వాటిని రేపటి రోజున ఓట్లుగా మార్చుకోవడం పైనే జగన్ ద్రుష్టి ఉందని ప్రతిపక్షాలు అంటున్నారు. పీసీసీ చీఫ్ శైలజానాధ్ వంటి వారి మాటల్లో అయితే అసలు ఏపీలో పాలన ఇంకా మొదలు కాలేదుట. ఇక ఆర్ధిక నిపుణులు అభివ్రుధ్ధికాముకులు కూడా ఏపీని ముందుకు తీసుకెళ్ళే విధంగా ప్రభుత్వం కచ్చితమైన విధానాలను అనుసరించాలని కోరుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణా కానీ తమిళనాడు, కర్నాటకలో కానీ అభివ్రుధ్ధి మీద టార్గెట్ చేస్తున్నారని, ఏపీలో మాత్రం పంచుడు రాజకీయమే ఎక్కువైందని అంటున్నారు. మరి మారాలి వైసీపీ సర్కార్ విధానాలు.