దెబ్బకు కామోష్ …జగన్ చాణక్యం….?
జగన్ కూడా క్రీస్తు పూర్వం కాలం నాటి చాణక్యుడి శిష్యరికం చేస్తున్నారు. అందరూ చంద్రబాబునే ఇంతవరకూ చూశారు. తాను కూడా చాణక్యుడి పాఠాలు కొన్ని చదివితే మంచిదని [more]
జగన్ కూడా క్రీస్తు పూర్వం కాలం నాటి చాణక్యుడి శిష్యరికం చేస్తున్నారు. అందరూ చంద్రబాబునే ఇంతవరకూ చూశారు. తాను కూడా చాణక్యుడి పాఠాలు కొన్ని చదివితే మంచిదని [more]
జగన్ కూడా క్రీస్తు పూర్వం కాలం నాటి చాణక్యుడి శిష్యరికం చేస్తున్నారు. అందరూ చంద్రబాబునే ఇంతవరకూ చూశారు. తాను కూడా చాణక్యుడి పాఠాలు కొన్ని చదివితే మంచిదని జగన్ ఇప్పటికైనా తెలుసుకున్నారు. ఎంతసేపూ ముక్కుసూటి రాజకీయాలు చేస్తూ పోతే ఏకంగా ముక్కు గుద్దుకోవడం తప్ప ఒరిగేది లేదని తెలుసుకున్నట్లున్నారు. అందుకే గేర్ మార్చారు, స్పీడ్ కూడా పెంచుతున్నారు. దీని ఫలితాలూ, పర్యవసానాలు తనకు పాజిటివ్ గానూ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించేవిగానూ ఉంటాయని జగన్ నిండా నమ్ముతున్నారు.
మోడీతో కూడితేనే ……
మోడీ అక్కడ ఉన్నాడు, తనకు అభయం ఇచ్చాడు అంటే ఏపీలోని బీజేపీ నేతలు అసలు ఊరుకోవడంలేదు, పొత్తు పేరిట చేరిన కొత్త మిత్రుడు పవన్ కళ్యాణ్ అయితే జగన్ మీద వీర విజృంభణే చేస్తున్నారు. జగన్ ఎక్కడ దొరుకుతాడు అంటూ జనసేనాని బూతద్దం పెట్టి మరీ వెతికేస్తున్నాడు. ఇక చంద్రబాబు అయితే సరేసరి. ఆయన నోటి వెంట జగన్నామస్మరణ తప్ప మరోటి రాదు. జగన్ కి తిట్టని రోజు అంటూ బాబుకు ఉండదు కూడా. ఏపీలో చీమ చిటుక్కుమన్నా జగన్ దే తప్పు అని రెచ్చిపోతారు చంద్రబాబు. మరి ఇవన్నీ గత ఏడాదిన్నరగా చూస్తున్న జగన్ కి ఇపుడు కొత్త ఐడియా వచ్చిందిట.
చేరిపోతేనే మేలు …..
కేంద్రంలోని మోడీ సర్కార్ లో చేరిపోతే ఎలా ఉంటుంది అన్నదే ఆ కొత్త ఆలోచన. ఎన్డీయే సర్కార్ లో జగన్ ఎంపీలు చేరితే అర్జంటుగా మూడు కేంద్ర మంత్రి పదవులు వస్తాయి. కేంద్రం డైరెక్ట్ గా నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరైన శాఖలు తీసుకుంటే తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు అయినా ఏపీని కొంతవరకూ ఆదుకుంటారు అన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. ఇక కేంద్రంతో బంధం కలవకుండా ఉంటే ఏపీలో విపక్షాల విమర్శలతో పాటు పాలనారధం కూడా ఎక్కడికీ కదలని స్థితిలో ఉందని అంటున్నారు. దైనందిన వ్యాపకాలకు కూడా నిధులు వెతుక్కోవాల్సిన దుర్బర పరిస్థితులు ఉన్నాయని కూడా చెబుతున్నారు.
ఒక్క షాట్ కి మూడు పిట్టలు ….
ఏపీలో జగన్ కి చంద్రబాబుతో ప్రధానంగా ఇబ్బంది ఉంది. తాను కనుక మోడీతో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుంటే ఇక ఏపీలో టీడీపీ దుకాణం బంద్ కావడం ఖాయం. అలాగే ఏపీ బీజేపీ నేతల నోళ్ళు కూడా చాలవరకూ మూతపడతాయి. దేవుళ్ళూ, గోపురాలు పేరిట చేసే రాజకీయ రచ్చ కూడా సద్దుమణుగుతుంది. అలాగే ఏ బీజేపెని చూసి ఎగిరెగిగి పడుతున్నారో అక్కడే తాళం వేస్తే పవన్ నోటి వెంట కూడా మాట రాకుండా కంప్లీట్ సైలెంట్ అవుతారని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారుట. ఇక ఏపీలో 2024 నాటికి టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బ తీయవచ్చునని, పవన్ని ఏమీ కాకుండా కూడా సైడ్ చేయవచ్చునని జగన్ ఎత్తులు వేస్తున్నారు అంటున్నారు. మొత్తానికి జగన్ కేంద్ర ప్రభుత్వంలో చేరడం వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో మైనారిటీలకు ఎలా నచ్చచెప్పాలా అన్నదే జగన్ ముందు ఉన్న పెద్ద సవాల్ ట. దానికి కనుక సమాధానం వెతుక్కుంటే జగన్ దెబ్బకు ఏపీలో విపక్షం అబ్బా అనకతప్పదట.