జగన్ ని మరీ అంత దూరం పెట్టారా…?
జగన్ అంటే ఒంటరి అంటారు. ఆయనది ఎపుడూ ఒంటరి పోరాటమే. ఆయనకు కూడా అదే ఇష్టం. తన పార్టీ ఎవరితోనూ ఎన్నికల పొత్తు పెట్టుకోదు అని 2014, [more]
జగన్ అంటే ఒంటరి అంటారు. ఆయనది ఎపుడూ ఒంటరి పోరాటమే. ఆయనకు కూడా అదే ఇష్టం. తన పార్టీ ఎవరితోనూ ఎన్నికల పొత్తు పెట్టుకోదు అని 2014, [more]
జగన్ అంటే ఒంటరి అంటారు. ఆయనది ఎపుడూ ఒంటరి పోరాటమే. ఆయనకు కూడా అదే ఇష్టం. తన పార్టీ ఎవరితోనూ ఎన్నికల పొత్తు పెట్టుకోదు అని 2014, 2019 ఎన్నికల వేళ కూడా జగన్ కుండబద్దలు కొట్టారు. ఆయనకు అలా సోలోగా నిలిచి గెలవడం ఇష్టం. ఇక జగన్ బాగా ఆంతరంగీకుడు అంటారు. ఆయన తన భావాలను తప్పనిసరి అయితే తప్ప ఎక్కడా ఎవరితోనూ పంచుకోరు అంటారు. జగన్ కి ఈ విధంగా చూస్తే రాజకీయాల్ల్లో మిత్రులు ఎవరు ఉండరు, అవసరార్ధం ఎవరితోనైనా ఆయన కలసినట్లుగా కనిపించినా అది మూడు నాళ్ళ ముచ్చటే మరి.
నాడే ఆశ్చర్యం కానీ ….
ఇక జగన్ కి కేసీయార్ కి మంచి స్నేహ బంధం ఉందని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. అలా అనుకోవడంలోనే ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే జగన్ తో రాజకీయంగా స్నేహాలు చేసేవారు పదేళ్ళ కెరీర్ లో ఎవరూ పెద్దగా లేరు. అయితే కేసీయార్ చతురుడు కాబట్టి అటునుంచే ఎక్కువగా వత్తిడి వచ్చి ఉంటుంది. అలా జగన్ తో కేసీయార్ తెర వెనక బంధాలు నెరిపారని అంటారు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కేసీయార్ వరసగా భేటీలు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఇలా ఉండగానే ఈ స్నేహం చెడిందని ఇపుడు కొత్తగా ప్రచారం జరుగుతోంది. జగన్ కేసీయార్ మనస్తత్వాలు తెలిసిన వారు మాత్రం దీన్ని పెద్దగా షాక్ గా భావించడంలేదు కానీ ఇలా ఎందుకు జరిగింది అనుకున్న వారూ రెండు పార్టీల్లోనూ చాలానే ఉన్నారు.
ఝలక్ ఇస్తారా….?
ఇక కేసీయార్ కి బీజేపీ అంటే పీకల్లోతు కోపంగా ఉంది. ఇవాళ కాకపోయినా రేపు అయినా బీజేపీతోనే తనకు అసలైన ప్రమాదం అని పసిగట్టే ఆయన కాషాయం మీద తొలి నుంచి కత్తికట్టారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక రిజల్ట్ తరువాత ఇక లాభం లేదు తెగించాల్సిందే అనుకుంటున్నారుట. అందుకోసం ఆయన డిసెంబర్ నెలలో దేశంలోని బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ప్రముఖ విపక్ష నేతలతో హైదరాబాద్ లో ఒక విస్రృత స్థాయి మీటింగ్ పెట్టారని అంటున్నారు. ఈ సమావేశం అజెండా యాంటీ బీజేపీ. ఈ కీలకమైన మీటింగుకు సాటి తెలుగు వాడు, పొరుగు రాష్ట్రం సీఎం అయిన జగన్ ని అసలు కేసీయార్ పిలవాలనుకోవడంలేదుట. ఆయన పార్టీ నేతలతో ఈ విషయం మాట్లాడినపుడు ఎక్కడా జగన్ పేరే ప్రస్తావించలేదని తాజా టాక్.
మోడీ మిత్రుడిగానే….
కేసీయార్ కి జగన్ కి చెడిపోవడానికి అసలు కారణం మోడీ అన్నది ఇపుడు అర్ధమవుతోంది. కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ 2018 డిసెంబర్లో హడావుడి చేసినపుడు తొలిగా పిలిచింది కలిసిందీ కూడా జగన్ నే. అప్పటికి జగన్ ఇంకా ఏపీ సీఎం కూడా కాదు. ఇద్దరూ కలిస్తే 42 మంది ఎంపీలు చేతిలో ఉంటారని, ఢిల్లీని గడగడలాడించవచ్చునని నాడు రెందు వైపుల నుంచి నేతలు పాజిటివ్ స్వరం వినిపించారు. ఆ తరువాత జగన్ సీఎం అయ్యారు. మెల్లగా ఆయన మోడీ వైపు మొగ్గు చూపించారు. అక్కడే కేసీయార్ కి కాలిందని అంటారు. దాంతో మోడీ మీద ఎంత కోపం ఉందో అంతకు రెండింతలు జగన్ మీద కూడా కేసీయార్ పెంచుకున్నారని అంటారు. దాంతో ఇపుడు జగన్ ని కలిసేందుకు కూడా కేసీయార్ ఇష్టపడడంలేదని అంటారు. మొత్తానికి జగన్ మళ్ళీ ఒంటరి అయ్యారని రాజకీయ వర్గాల టాక్.