కేసీఆర్ చేసిన తప్పు జగన్ చేయరట…?
జగన్ కి రాజకీయంగా అనుభవం పదేళ్ళు అయినా ఆయనకు జనంలో బంధం మాత్రం బహు గట్టిది. జనం గుండె చప్పుడు తెలుసుకునే అతి కొద్ది మంది రాజకీయ [more]
జగన్ కి రాజకీయంగా అనుభవం పదేళ్ళు అయినా ఆయనకు జనంలో బంధం మాత్రం బహు గట్టిది. జనం గుండె చప్పుడు తెలుసుకునే అతి కొద్ది మంది రాజకీయ [more]
జగన్ కి రాజకీయంగా అనుభవం పదేళ్ళు అయినా ఆయనకు జనంలో బంధం మాత్రం బహు గట్టిది. జనం గుండె చప్పుడు తెలుసుకునే అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో జగన్ ఒకరు. అందుకే 2019 ఎన్నికల్లో ఆయన అందరి కంటే కూడా ధీమాగా కనిపించారు. ఇపుడు కూడా ఆయన దూకుడు వెనక ధైర్యం జనాలే. ఇదిలా ఉంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను ఎదుర్కొనందుకు జగన్ తనదైన మార్క్ ప్లాన్ రెడీ చేసిపెట్టుకున్నారు. ఏపీ వరకూ తనకు ఎవరూ పోటీ కాదని జగన్ భావిస్తున్నా కూడా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నదే జగన్ ఆలోచన. అందుకే ఆయన తిరుపతి ఎన్నికను చాలా సీరియస్ గానే తీసుకున్నారని అంటున్నారు.
దుబ్బాకతో అలెర్ట్ ….
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అధికార టీయారెస్ కి వ్యతిరేకంగా వచ్చింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నింటికంటే మించి కేసీయార్ అతి విశ్వాసమే కొంప ముంచిందని విశ్లేషణలు ఉన్నాయి. కేసీయార్ దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. కనీసం ఆయన చివరి నిముషంలో ప్రచారం చేసినా విజయం కచ్చితంగా టీయారెస్ ఖాతాలో పడేది. జనాలలోనూ పాజిటివ్ భావన వచ్చేది. కానీ అక్కడ అది జరగలేదు. జగన్ దాన్ని కూడా గమనంలోకి తీసుకున్ని అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంటున్నారని చెబుతున్నారు.
ప్రచారానికి రెడీ …..
జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారనికి వెళ్తారని అంటున్నారు. తాను ఏడాదిన్నర కాలంగా చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి అది సరైన వేదికగా కూడా ఆయన భావిస్తున్నారు. తిరుపతి వేదికగా విపక్షాల డొల్లతనాన్ని ఎండగట్టడానికి కూడా ఆయన సంసిద్ధులు అవుతున్నారుట. పేరుకు తిరుపతి ఎన్నిక అయినా కూడా ఏపీ మొత్తం దాన్ని గమనిస్తుంది కాబట్టి ప్రభుత్వం గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం ద్వారా మొత్తం ఏపీ జనాలకు కూడా సానుకూల సంకేతాలు పంపడానికి వీలు అవుతుందని జగన్ వ్యూహంగా ఉంది. అందుకే ఆయన తిరుపతి ప్రచారానికి రెడీ అంటున్నారుట.
ఇరుకున పెడతారా …?
తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఎగిరి గంతులేస్తున్న టీడీపీ, బీజేపీ తప్పుడు విధానాలను కూడా జగన్ ఎండగడతారు అంటున్నారు. ఏపీలో ఓటు అడిగే హక్కు తొంబై శాతం హామీలు నెరవేర్చిన తన ప్రభుత్వానికే ఉందని కూడా జగన్ ఢంకా భజాయించి చెబుతారుట. ఇక ప్రత్యేక హోదాతో బీజేపీని, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాజీ పడిన టీడీపీని ఎండగట్టడానికి కూడా జగన్ ఆలోచిస్తున్నారని టాక్. అదే విధంగా వెనకబడిన రాయలసీమ విషయంలో ఆ పార్టీలు ఏం చేశాయో కూడా నిలదీస్తారని అంటున్నారు. ఇక మూడు రాజధానుల అంశాన్ని జనంలోనే పెడతారా అన్న చర్చ కూడా పార్టీలో ఉందిట. మొత్తానికి తాను జనం మనిషిని అని చెప్పుకోవడానికి జగన్ ఎపుడూ ముందే ఉంటారని వైసీపీలో అంటున్న మాట.