Fri Apr 19 2024 05:39:11 GMT+0000 (Coordinated Universal Time)
అఖిల్ సినిమాపై క్లారిటీ...!
త్వరలో అక్కినేని అఖిల్ రెండో చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే తన తెరంగేట్రం చిత్రం 'అఖిల్' డిజాస్టర్ కావడంతో ఆయన తన రెండో చిత్రం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కాగా 'ఊపిరి' దర్శకుడు వంశీపైడిపల్లితో కథాచర్చలు జరుగుతున్నాయని ఆమద్య నాగ్ కూడా అన్యాపదేశంగా హింట్ ఇచ్చాడు. ఇప్పుడు దర్శకుడు వంశీపైడిపల్లి కూడా అఖిల్ సినిమాకు సంబంధించి కథాచర్చలు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. 'ఊపిరి' రిలీజ్ తర్వాత అసలు విషయం ప్రకటిస్తానని వంశీ అంటున్నాడు. 'ఊపిరి' రిలీజ్ మొదటి రోజే నిర్ణయం తీసుకోకుండా ఓ వారం పాటు ఆగి 'ఊపిరి' ఏ రేంజ్లో ఆడుతున్నది అనే విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతే వంశీ విషయంలో నాగ్, అఖిల్లు నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి 'ఊపిరి' చిత్ర విజయంపై అఖిల్ రెండో సినిమా డైరెక్టర్ ఆధారపడి ఉన్నాడన్నది మాత్రం వాస్తవం.
Next Story