ఇప్పుడు మరో హీరోగారు బయలుదేరాడు!!
మొన్నేమో ఎన్టీఆర్ విడుదల కాబోయే సినిమాలను ఐసియు లో ఉన్న పేషేంట్స్ గా పోల్చి సినీ విశ్లేషకులను దారిన పోయే దానయ్యలుగా పోల్చి క్రిటిక్స్ మీద యుద్దానికి సై అన్నాడు. ఆ విషయంపై ఆ రోజంతా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక నిన్నేమో మహేష్ బాబు స్పైడర్ విడుదల సందర్భంగా రివ్యూ రైటర్స్ సినిమా బావుంది అంటే బావుంది అని రాస్తారు.... లేదంటే లేదని రాస్తారు. నేను కూడా రివ్యూలు చదువుతా... నాకెప్పుడూ అలా అనిపించలేదన్నాడు. మరి ఇద్దరు స్టార్ హీరోలు ఒకరు రివ్యూలపై మండిపడితే మరొకరు రివ్యూస్ గురించి లైట్ తీసుకున్నారు. అయితే సమీక్షలపై మాట్లాడడానికి ఇండస్ట్రీలో మరో హీరో బయలు దేరాడు.
మంచు విష్ణు మనసులో మాట.....
తెలుగులో మూసగొట్టుడు చిత్రాలతో ఇప్పటివరకు ఒకటి అరా తప్ప ఎలాంటి హిట్స్లేని మంచు విష్ణు తాజాగా రివ్యూలపై స్పందించాడు. ఆయన అసలు సినిమాలు చూడకుండానే రివ్యూలు రాస్తున్నారని, మనసు పెట్టి సినిమాను చూడకుండా అప్డేట్స్ ఇస్తున్నారని, శ్రద్దగా, ఏకాగ్రతగా చూస్తే సినిమాపై మరింత స్పష్టమైన అభిప్రాయం వస్తుందన్నాడు. సినిమాను చూస్తూ అసలు ఎటువంటి అప్డేట్స్ను ఇవ్వరాదని సూచించాడు. బాధ్యత ఉన్నవారెవ్వరూ ఆ పని చేయరని, తాము ఎంతో కష్టపడి సినిమాలు తీస్తుంటే మంచి సమీక్షలు రావడం లేదంటున్నాడు.
సమీక్షలపై సుద్దులు చెబితే ఎలా?
అయితే అసలు ఆ విషయానికే వస్తే అసలు తెలుగు హీరోలలో 90శాతం మందికి సరైన స్క్రిప్ట్ని ఎంచుకోవడం, అసలు స్క్రిప్ట్ని చదవి విజన్ చేసుకోవడం రాదని చెప్పాల్సివుంది. సినిమా వారు కష్టపడి సినిమా తీస్తున్నాం.. అయినా మంచి సమీక్షలు రావడం లేదని అంటున్నారు. ప్రేక్షకులు కూడా పెరిగిన సినిమా రేట్లు, ఇతర తినుబండారాలు, డ్రింక్లు వంటి వన్నీ కలుపుకుని సినిమా చూద్దామంటే వేలలో ఖర్చవుతోందని, తాము ఆ వెయ్యి రూపాయలను సంపాదించడానికి పడే కష్టం సినిమా తీసే వారికి అర్ధం కావడం లేదని ఆరోపిస్తున్నారు.
- Tags
- మంచు విష్ణు