Thu Apr 25 2024 14:09:12 GMT+0000 (Coordinated Universal Time)
గోవా ట్రిప్లో ఉన్న సూపర్స్టార్...!
మహేష్బాబు కొన్నిరోజులుగా 'బ్రహ్మూెత్సవం' షూటింగ్లో యమా బిజీగా గడిపాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇందులోని మహేష్
నటించాల్సిన టాకీపార్ట్ పూర్తవ్వడంతో ఆయన తన ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లాడు. సాధారణంగా ప్రతి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన ఎక్కువగా విదేశీ టూర్లకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. అయితే ఈసారి మాత్రం ఆయన గోవాలో ప్లాన్ చేశాడు. మండే ఎండల నుండి కాస్తంత సేద తీరడానికి ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లాడు. గోవాలో వీరి ప్యామిలీ ఫొటోను నమ్రత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక 'బ్రహోత్సవం' విషయానికి వస్తే ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరున అంటే ఏప్రిల్ 29న రిలీజ్ చేయాలా? లేక మేలో రిలీజ్ చేయాలా? అనే విషయం మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
Next Story