నారి నారి నడుమ మురారి...!
తాను చేసిన కొద్ది చిత్రాలతోనే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకొని తనకంటూ ఓ స్టైల్ను క్రియేట్ చేసుకున్న మెగాహీరో వరుణ్తేజ్. కాగా ఆయన త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్స్తో రొమాన్స్ చేయని వరుణ్ తన తాజా చిత్రంలో ఇద్దరు భామలతో కలిసి నటిస్తున్నాడు. ఈ ఇద్దరు లావణ్యత్రిపాఠి, రెజీనా. మరి ఈ చిత్రంలో రొమాన్స్పరంగా వరుణ్తేజ్ ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుకుంటాడో చూడాలి...! ఏప్రిల్ నుండి అఫీషియల్గా లాంఛ్ కానున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి 'ఫీల్ మై లవ్' అనే టైటిల్ను అనుకొంటున్నారు. చాలాకాలం తర్వాత శ్రీనువైట్ల చేస్తున్న అచ్చమైన ప్రేమకథా చిత్రం ఇదేనని సమాచారం. కాగా ఈ చిత్రానికి మిక్కీజెమేయర్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటివరకు కమర్షియల్గా సక్సెస్లేని వరుణ్తేజ్కు, 'ఆగడు, బ్రూస్లీ' వంటి డిజాస్టర్స్ తర్వాత చేస్తున్న శ్రీనువైట్లకు ఇరువురికి కీలకంగా మారనుంది.