ప్రభాస్ బిజినెస్ ప్లాన్ మాములుగా లేదు
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మైండ్ సెట్ పూర్తిగా మారినట్టుగా కనబడుతుంది. ఇదివరకు సినిమాల్లో చేస్తూ యాడ్స్ లో నటించడానికి జంకే ప్రభాస్ ఇప్పుడు పలు యాడ్ కంపెనీలతో డీల్ కూర్చుకుంటున్నాడు. పలు కంపెనీల ప్రొడక్ట్స్ కి బాహుబలి ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. బాహుబలి వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నటించిన ప్రభాస్ ఇప్పుడు తన ఫ్రెండ్స్ యువీ క్రియేషన్స్ వారి నిర్మాణంలో సాహో చిత్రంలో నటిస్తున్నాడు. అయితే సినిమాలో ఫేమ్ ఉన్నంత వరకే క్రేజ్ ఉంటుందని భావించిన ప్రభాస్ ఇపుడు తన దృష్టి బిజినెస్ మీదకి కూడా మరల్చుతున్నట్టుగా తెలుస్తుంది.
నెల్లూరులో భారీ మల్టిప్లెక్స్.....
ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ బ్యాచ్ యువీ క్రియేషన్స్ పేరిట చిన్నచిన్న చిత్రాలను తెరకెక్కిస్తూ సినిమా రంగంలో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు వీరు థియేటర్స్పై ఫోకస్ చేసినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ మల్టిప్లెక్స్ థియేటర్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారట ప్రభాస్ అండ్ కో. అక్కడి నేషనల్ హైవేకి సమీపంలో నిర్మాణపు పనులు అప్పుడే స్టార్ట్ అవడమేగాక వేగంగా జరుగుతున్నాయంటున్నారు.
ఏడున్నర ఎకరాల్లో....
దాదాపు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టిప్లెక్స్ లో మూడు థియేటర్ల తోపాటు రెస్టారెంట్లు, చిన్నారుల ఆటల కోసం స్పెషల్గా ఓ విభాగాన్ని రెడీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక అందులో ఓ థియేటర్ అయితే త్రీడీ ఎఫెక్ట్స్తో కూడిన 106 అడుగుల భారీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తున్నారట. అందులో ఒకేసారి 670 మంది కూర్చుని సినిమా చూసేలా వీలుంటుందట. ఇక ఈ మల్టీప్లెక్స్ థియేటర్ కోసం ప్రభాస్ అండ్ కో 40 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ థియేటర్ ప్రారంభోత్సవం వచ్చే ఏడాదిలో ఉంటుందంటున్నారు.
- Tags
- ప్రభాస్