మహేష్కు ప్రతినాయకుడు ఎవరు..?
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం ప్రీపొడక్షన్ పనులు కూడా స్పీడందుకున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత అంటే 'స్టాలిన్' తర్వాత మురుగదాస్ చేస్తున్న తెలుగు, తమిళ చిత్రం ఇది. కాగా ఇటు మహేష్కు, అటు మురుగదాస్కు ముంబై బ్యాక్డ్రాప్ బాగా కలిసొచ్చింది. మురుగదాస్ తీసిన 'తుపాకి', మహేష్ నటించిన 'బిజినెస్మేన్' చిత్రాలు కెండు ముంబై బ్యాక్డ్రాప్లోనే నడిచే సినిమాలు కావడం, అవి పెద్ద హిట్గా నిలవడంతో తాజాగా మహేష్-మురగదాస్ల చిత్రం కూడా ముంబై బ్యాక్డ్రాప్లో సాగనుంది కాగా ఈమధ్య వచ్చిన 'శ్రీమంతుడు' తర్వాత మహేష్బాబులో కాస్త మార్పు వచ్చింది. మంచి సామాజిక సందేశం ఉన్న చిత్రాలను చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారు. అలాగే మురుగదాస్ ఇప్పటివరకు తీసిన చిత్రాలన్నింటిలో ఏదో ఒక సోషల్ మెసేజ్ కంపల్సరీ. అవినీతి, రైతు సమస్యలు, స్లీపింగ్ సెల్స్ వంటి పాయింట్లను ఆయన తన కథాంశాలుగా తీసుకుంటూ ఉంటాడు. తాజాగా మహేష్ చిత్రం కూడా మంచి సందేశాత్మక చిత్రంగా రూపొందనుందని అంటున్నారు. కాగా ఈచిత్రంలో హీరోయిన్ ఇంకా పైనల్ కాలేదు. పరిణితి చోప్రా, కీర్తిసురేష్, సాయిపల్లవిలలో ఒకరిని సెలక్ట్ చేయాలని భావిస్తున్నారు. ఈమధ్య గ్లామర్షోకు కూడా సై అని కీర్తిసురేష్ స్పష్టం చేయడంతో తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్న కీర్తిసురేష్ను హీరోయిన్గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈచిత్రంలో ప్రధాన విలన్ పాత్రను ఎస్.జె.సూర్య చేయనున్నాడని విశ్వసనీయ సమాచారం. ఆయన డైరెక్టరే కాదు... మంచి నటుడు కూడా. ఆయన దర్శకత్వంలో మహేష్ 'నాని' వంటి డిజాస్టర్ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక మరో చిన్నపాత్రలో మహేష్ సన్నిహితుడు, 'టక్కరిదొంగ' నిర్మాత, దర్శకుడు అయిన జయంత్ సి.పరాన్జీ పోషించనున్నాడట. ఇక ప్రస్తుతం మహేష్ తాజాగా 'బ్రహ్మూెత్సవం' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 'సీతమ్మవాకిట్లో..సిరిమల్లె చెట్టు' చిత్రం తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటిస్తుండటం, పివిపి సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెటుగుతో పాటు తమిళంలో కూడా నిర్మిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఆంగ్ల సంవత్సరాది సందర్బంగా అంటే జనవరి 1న విడుదలైన ఈ చిత్రం టీజర్కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా తెలుగు సంవత్సరాది అంటే ఉగాది పర్వదిన సందర్బంగా ఏప్రిల్ 8వ తేదీన ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేసి అభిమానులను ఖుషీ చేయనున్నాడని తెలుస్తోంది. కాగా ఈచిత్రంలో సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.