మహేష్ చిత్రాలపైనే కన్నేస్తున్న చానెల్...!
సినిమాల శాటిలైట్ విషయంలో జెమిని, మాటీవీ పోటీని ఎవ్వరు తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో మంచి పేరున్న జీ గ్రూప్కూడా ఏమీ చేయలేకపోతోంది. అయితే మిగిలిన హీరోల సంగతేమో గానీ మహేష్బాబు నటించే చిత్రాలపై మాత్రం జీచానెల్ చాలా ఆసక్తి చూపుతోంది. ఇటీవల వచ్చి రికార్డును బద్దలుకొట్టిన 'శ్రీమంతుదు' రైట్స్ను దక్కించుకున్న ఈ చానెల్ పెద్ద వ్యవధి ఇవ్వకుండానే చిత్రాన్ని టెలికాస్ట్ చేసి మంచి టిఆర్పీ రేటింగ్స్ను, ప్రకటనల ద్వారా మంచి లాభాలనే గడించింది. తాజాగా మహేష్ నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మూెత్సవం' చిత్రం శాటిలైట్ హక్కులను కూడా జీ చానెల్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ చిత్రం శాటిలైట్ హక్కుల కోసం వారు పివిపి నిర్మించిన చిత్రాలైన 'వర్ణ, సైజ్జీరో' చిత్రాలను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో 13కోట్లకు దక్కించుకున్నారని సమాచారం. మరి ఇక నిన్నటి 'శ్రీమంతుదు' చిత్రాన్ని 10కోట్లకు సంపాదించుకున్న ఈ చానెల్ 'బ్రహ్మూెత్సవం'ను కూడా పోటీపడి మరీ చేజిక్కించుకుందని అంటున్నారు.