రోహిత్ను స్టార్గా చేసేవరకు నిద్రపోయేలా లేరు....!
నారారోహిత్.. 'బాణం' నుండి 'తుంటరి'వరకు విభిన్న చిత్రాలను చేస్తూ వస్తున్నాడు. కాగా వారాహిచలనచిత్రం పతాకంపై సాయికొర్రపాటి నిర్మాణంలో సాయిశివాని సమర్పణలో నారా రోహిత్ హీరోగా, నందమూరి తారకరత్న విలన్గా నటిస్తున్న చిత్రం 'రాజా చేయి వేస్తే'. ఈ చిత్రం ద్వారా ప్రదీప్ చిలుకురు దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం ఆడియోను మార్చి 25వ తేదీన విజయవాడలోని సిద్దార్ధ్ పబ్లిక్స్కూల్ గ్రౌండ్స్లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు ఆయన పెదనాన్న, ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మొత్తానికి ఎవరో జూనియర్ ఎన్టీఆర్ వంటి వారిని బతిమిలాడుకొని సినీ గ్లామర్ను ఉపయోగించుకొనే పరిస్ధితి రాకుండా, తన నారా వారి అబ్బాయ్నే స్టార్హీరోగా చేయడం మేలని చంద్రబాబు ఆశపడుతున్నాడట. దానికి బాలయ్య కూడా తనవంతు సాయం అందిస్తున్నాడని సమాచారం.