సింపుల్ పెళ్ళికి గ్రాండ్ రిసెప్షన్ లేనట్లేనా?
నాగ చైతన్య - సమంత ల పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు సమక్షంలో గోవాలోని డబ్ల్యూ రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి పలువురు సినీప్రముఖులు హాజరవుతారని పెళ్ళికి ముందు బాగా ప్రచారం జరిగింది. కానీ నాగార్జున, చైతు - సామ్ ల పెళ్ళికి ఎవ్వరిని ఆహ్వానించలేదు. కారణం సమంత - నాగ చైతన్య లు తమకి సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పడం తో వారి నిర్ణయానికి తలొగ్గిన నాగార్జున పెళ్లి సింపుల్ అయినా రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా ఉంటుందని ఆ జంటకి చెప్పడం వారు ఒకే అనడం జారిపోవడమే కాదు చైతు - సామ్ ల కోరిక మేరకు వారి పెళ్లి చాలా సింపుల్ గా కేవలం 100 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిపోయింది.
ఇక పెళ్లిని రెండు సాంప్రదాయాలలో చేసుకున్న ఈ జంట రిసెప్షన్ కోసం అక్కినేని అభిమానులతోపాటు... సినిమా పరిశ్రమ మొత్తం ఎదురు చూస్తుంది. అయితే నాగ్ మాత్రం డేట్ క్లారిటీ ఇవ్వకుండా మొదటినుండి సమంత - నాగ చైతన్య ల రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నాడు. ఇక నాగార్జున ని ఎక్కడ కనబడితే అక్కడ మీడియా కూడా చైతు - సామ్ ల రిసెప్షన్ ఎప్పుడంటూ వెంటపడుతుంది. కానీ నాగార్జున మాత్రం కూల్ గా చైతు - సామ్ ల రిసెప్షన్ పై ఇంకా క్లారిటీ రాలేదు అంటున్నాడు. రిసెప్షన్ కోసం నేను సమంత, నాగచైతన్య ల డేట్స్ అడుగుతున్నాను. మరి వాళ్లు ఎప్పుడు చెబితే అప్పుడు ఈ రిసెప్షన్ ఉంటుంది. కాకపోతే ఇంత తొందరగా ఈ రిసెప్షన్ ఎందుకని నాకు కూడా అనిపిస్తోంది. ఇప్పుడే కదా పెళ్లయింది. కొన్నాళ్లు వాళ్లను అలా ఎంజాయ్ చేయనీయండి అంటూ మీడియాకి చెబుతున్నాడు.
అంటే దీన్నిబట్టి చైతు - సామ్ ల రిసెప్షన్ ఉత్తుత్తి మాటలే అన్నమాట. అసలు పెళ్ళికి సినీపెద్దలను, సన్నిహితులని ఆహ్వానించని నాగ్ ఇప్పుడు రిసెప్షన్ కోసం అందరిని దగ్గరుండి అహానిస్తాడు అనుకున్నారు అంతా. అయినా ఇప్పటివరకు సినిమా పరిశ్రమలోని ఎవరిని ఈ రిసెప్షన్ కోసం నాగ్ ఆహ్వానించలేదంటేనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది.... ఈ రిసెప్షన్ లేదని. మరి నాగార్జున ఈ రిసెప్షన్ కోసం భారీ ఏర్పాట్లు చేసి బంధువులను, స్నేహితులని, ఇండస్ట్రీలోని నటీనటుల్ని అందరిని పిలువాలనుకున్నాడు. దీన్ని బట్టి నాగ్ ఆశలు మీద చైతు, సామ్ లు నీళ్లు చల్లేలానే కనబడుతున్నారు.