Fri Apr 26 2024 00:55:48 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ స్టార్ కి తెగ నచ్చేసింది.!
తమిళ్ లో విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ చిత్రం తెలుగులో ‘అభిమన్యునుడు’ పేరుతో రిలీజ్ అయ్యి రెండు రాష్ట్రాల్లో మంచి టాక్ తెచ్చుకుని.. మంచి వసూళ్లు చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. సినీ లవర్స్ కే కాదు క్రిటిక్స్ కి కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది. అంతే కాదు ఈ సినిమా చాలా మంది సెలెబ్రెటీస్ కి కూడా నచ్చింది. లేటెస్ట్ గా ‘అభిమన్యునుడు’ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు చూడడం జరిగింది. ఆయనకు ఈ సినిమా బాగా నచ్చిందని.. చాలా ఇంప్రెస్ అయ్యానని ఆయన అన్నారు. ఈ చిత్రాన్ని తీసిన మిత్రన్ విజన్, డైరెక్షన్ చాలా బాగా ఉన్నాయని.. చాలా రీసెర్చ్ చేసి ఈ సినిమా తీశారంటూ హీరో విశాల్, చిత్ర టీమ్ కు అభినందనలు తెలిపారు మహేష్ బాబు.
Next Story