తన మానవత్వాన్ని చాటుకున్న బన్నీ..!
తుఫాను బీభత్సంతో అతలాకుతలం అయిన కేరళ ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. కేరళ ప్రజలంటే తనకెంతో అభిమానం ఉందని...తన మనసులో వారికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే అక్కడ వరదలు కారణంగా 37 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఎడతెరిపి వర్షాలతో అక్కడ రోడ్లు అన్ని మునిగిపోయాయి..చాలా ప్రాంతాలు ఇంకా వరదల్లో చిక్కుకున్నాయి.
అండగా నిలిచిన సినీ నటులు
ఈ విషయాలన్నీ తెలుసుకున్న స్టైలిష్ స్టార్ తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను కేరళ ప్రజల కోసం విరాళమిస్తున్నట్టు ట్విటర్ లో ప్రకటించారు. కోలీవుడ్ నుండి కార్తీ, సూర్య 25 లక్షల ప్రకటించగా.. కమల్ హాసన్ కూడా విరాళం ప్రకటించారు. అంతే కాదు మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ 5 లక్షల ప్రకటించాడు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నుండి ఇంకొంతమంది స్టార్స్ ముందుకు వచ్చి కేరళ ప్రభుత్వానికి విరాళాలు ప్రకటించనున్నారు.