Fri Apr 26 2024 08:57:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆగస్ట్ 24న రానున్న ఆటగాళ్లు
నారా రోహిత్, జగపతి బాబు హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా ఆటగాళ్లు. ఈ చిత్రం ఆగస్ట్ 24న విడుదల కానుంది. పరుచూరి మురళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్షన బానిక్ ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పరుచూరి మురళి. అందుకే ట్యాగ్ లైన్ కూడా గేమ్ ఆఫ్ లైఫ్ అని పెట్టారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నారా రోహిత్, జగపతిబాబుపై వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలవనున్నట్లు చెబుతున్నారు. సాయికార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ ఆటగాళ్లు చిత్రానికి మరో మేజర్ హైలైట్.
Next Story