జోరు మీద ఉన్న చరణ్!!
నాని కృష్ణార్జున యుద్ధం సినిమా రాకతో రంగస్థలం కలెక్షన్స్ కి బ్రేక్ పడే అవకాశం ఉందని...వసూల్ విషయంలో రామ్ చరణ్ వెనక్కి తగ్గే పరిస్థితి వస్తుందని అంత అనుకున్నారు. కానీ కృష్ణార్జున యుద్ధం సినిమా నిరాశ పరచడంతో.. రామ్ చరణ్ రంగస్థలం సినిమా మరోసారి బాక్సాఫీస్ని డామినేట్ చేస్తోంది. రంగస్థలం సినిమా శనివారం ఉదయం షో నుండే హౌస్ఫుల్స్ నమోదవుతున్నాయి. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి.
చిరంజీవి రికార్డ్స్ ను.....
ఈ రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్లు షేర్ ను వసూల్ చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఇదే కనక జరిగితే రామ్ చరణ్ తన తండ్రి రీసెంట్ మూవీ 'ఖైదీ నంబర్ 150' రికార్డుని దాటడం ఖాయం. రికార్డ్స్ పరంగా ఈ సినిమా రోజుకొక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రెండు వారాల్లోనే వంద కోట్లకి పైగా షేర్ ను సాధించి రంగస్థలం కొత్త రికార్డు నమోదు చేసింది.
ఆ సినిమా వచ్చే వరకూ....
ఈ జోరు 'భరత్ అనే నేను' సినిమా వచ్చే వరకు కొనసాగనుంది. మహేష్ సినిమా టాక్ బాగుందని, హిట్ అయినా ఫుల్ రన్లో నూట పది కోట్ల షేర్ అయితే గ్యారెంటీ అని ట్రేడ్ ఘంటాపధంగా అంటోంది. ఒకవేళ మహేష్ సినిమా కూడా అదే పాజిటివ్ టాక్ ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరటం ఖచ్చితం అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.