విజయ్ - పూరి సినిమాపై క్లారిటీ..!
'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఈ సినిమాతో 100 కోట్లు గ్రాస్ క్లబ్ చేరాడు. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటె గత రెండు రోజులు నుండి టాలీవుడ్ లో ఓ రూమర్ హల్ చల్ చేస్తుంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నాడని.. స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని..పూరి చెప్పిన లైన్ కు విజయ్ ఇంప్రెస్స్ అయ్యాడని..ఇలా చాలానే వచ్చాయి. అయితే ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. పూరితో పాటు ఇప్పటివరకు ఏ కొత్త డైరెక్టర్ తోనూ నేను ఏ సినిమా కమిట్ అవ్వలేదని విజయ్ క్లారిటీ ఇచ్చాడు.
ఇవన్నీ పూర్తయ్యాకే..!
ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే, నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తానని తెలిపాడు. ప్రస్తుతం విజయ్ 'టాక్సీవాలా' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఇంకా తమిళ, తెలుగులో ఒకేసారి 'నోటా' అనే సినిమాతో మనముందుకు రానున్నాడు. ఇది కాకుండా చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయాల్సి ఉంది. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమాతో పాటు గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లోనే ఇంకో సినిమాకు అడ్వాన్స్ అందుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి మరో రెండేళ్లు పడుతుంది. అప్పటివరకు ఇంకో సినిమాను కమిట్ అవ్వనని క్లారిటీ ఇచ్చాడు విజయ్. దీంతో పూరితో సినిమా లేదని క్లారిటీ వచ్చింది.