Thu May 02 2024 18:01:49 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం : సీఈసీ రాజీవ్ కుమార్
ఎన్నికలు తాము సిద్ధంగా ఉన్నామని కేద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు
ఎన్నికలు తాము సిద్ధంగా ఉన్నామని కేద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లోక్సభ ఎన్నికలతో పాటు సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా జరగనున్నాయని ఆయన తెలిపారు. ఎన్నికలకు అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
సజావుగా నిర్వహించేందుకు...
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు యాత్రాంగానికి అవసరమైన శిక్షణ కూడా అందించనున్నామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయన్న కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందని ఆయన చెప్పలేదు. సకాలంలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.
Next Story