Thu May 02 2024 18:44:20 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు కరోనా
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కరోనా సోకింది. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కరోనా సోకింది. ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. అశోక్ గెహ్లాత్ కు స్వల్ప లక్షణాలు కనపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం అశోక్ గెహ్లాత్ హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.
తనను కలసిన వారు....
తనను నాలుగైదు రోజుల నుంచి కలసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అశోక్ గెహ్లాత్ కోరారు. కరోనా నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.
Next Story