Tue Apr 30 2024 23:01:47 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణకు హాజరవుతారా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న తమ ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. కవితకు నోటీసుల విషయాన్ని సీబీఐ అధికారులు కూడా ధృవీకరించారు. గతంలో రెండు సార్లు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
మాగుంట రాఘవ ఇచ్చిన...
అయితే ఇప్పటికే కవితకు ఈడీ నోటీసులు జారీపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో సీబీఐ కేసులో కవిత హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవ ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితకు నోటీసులు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Next Story