Sun May 05 2024 05:53:07 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరుగుతుంది
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.
హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ తో అనేక అంతర్జాతీయ కేసులు సత్వరం పరిష్కారమవుతాయని చెప్పారు. దేశానికి హైదరాబాద్ లోని ఈ సెంటర్ తలమానికంగా నిలుస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. చాల తక్కువ సమయంలోనే ఈ సెంటర్ పనులను ప్రభుత్వం పూర్తి చేసిందని, ఇందుకు ధన్యవాదాలని ఆయన చెప్పారు.
శాశ్వత భవనం కోసం....
హైదరాబాద్ ను ప్రేమించే వారిలో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సెంటర్ శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో స్థలం కేటాయించామని, త్వరలో శాశ్వత భవనాన్ని పూర్తి చేసుకుని అందులోకి వెళ్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం తాత్కాలికంగా నానక్ రామ్ గూడలోని వీకే టవర్స్ లో ఈ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు కేటీఆర్, ఇంద్రకిరణ్ రెడ్డి తదిరులు హాజరయ్యారు.
Next Story