Sun May 19 2024 03:00:51 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కాంగ్రెస్ లో నలుగురికి కీలక పదవులు.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. ముగ్గురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. ముగ్గురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లురవిని నియమించింది. ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలి, వేం నరేందర్ రెడ్డి, హరకర వేణుగోపాల్ ని నియమిస్తూ ప్రభుత్వం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఇందులో షబ్బీర్ అలీకి కేబినెట్ హోదా కల్పించింది.
తొలిసారి నియామకం...
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారి ప్రభుత్వ సలహాదారుల నియామకం చేపట్టింది. ఇందులో బ్రాహ్మణ, మైనారిటీ, రెడ్డి సామాజికవర్గాలకు చోటు కల్పించింది. మల్లు రవికి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతో ఆయనకు టిక్కెట్ వస్తుందని భావించారు. అయితే మల్లురవిని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతో ఇక పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనట్లే.
Next Story