Fri Mar 29 2024 01:02:13 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ జేసీకి హైకోర్టు అక్షింతలు
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి హైకోర్టు అక్షింతలు వేసింది. తనపై విమానయాన సంస్థలు నిషేధాన్ని విధించడాన్ని సవాలు చేస్తూ జేసీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జేసీ పిటిషన్ పై విచారించిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దివాకర్ ట్రావెల్స్ లో ఇలా జరిగితే అనుమతిస్తారా? అని హైకోర్టు న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు. దీంతో జేసీ తరుపున న్యాయవాది కూడా కంగుతిన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయని, ఆయనను విమానంలో ప్రయాణించడానికి అనుమతించేలా ఉత్తర్వులివ్వాలని జేసీ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. కాని విమానయాన సంస్థల వాదన వినకుండా తాము ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు చెప్పింది.
Next Story