నవదీప్ ఫాం హౌస్ పై పోలీసుల దాడి!
రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో రంగారెడ్డి మోమిన్ పేట మండలం చక్రంపల్లిలో సినీ హీరో నవదీప్ ఫామ్ హౌస్ పై శుక్రవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు దాడిచేశారు. 20 విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ మేనేజర్, వాచ్ మేన్ లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకను గమనించి నవదీప్, మిగిలిన వారు తప్పించుకుపోయారని పోలీసులు తెలిపారు. పార్టీలో నవదీప్ తో పాటు మరో సినీ నటుడు, కొందరు అమ్మాయిలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. పార్టీకి హాజరైన వారంతా మద్యం తాగడంతో పాటు అమ్మాయిలతో కలిసి డ్యాన్సులు చేశారని చెబుతున్నారు. దీనిపై మోమిన్ పేట సీఐ రంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ ఫామ్ హౌస్ లో ఎలాంటి రేవ్ పార్టీ జరగలేదని నవదీప్ అంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న విందు చేసుకున్నామని నవదీప్ టిట్వర్ లో పోస్ట్ చేశారు. పోలీసులు ప్రస్తుతం ఈ కేసు విచారిస్తున్నారు.