Sat Apr 20 2024 05:07:28 GMT+0000 (Coordinated Universal Time)
అక్బరుద్దీన్ పై కేసు
ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ పై కేసు నమోదయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని న్యాయవాది కరుణాసాగర్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లింలంతా ఒక్కటైతే యాభై పార్లమెంటు స్థానాలను సులువుగా గెలుచుకోవచ్చని అక్బరుద్దీన్ పిలుపునివ్వడంపై ఈ కేసు నమోదయింది. రెండు మతాల మధ్య విభేదాలు చెలరేగేలా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ న్యాయవాది చేసిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించి కేసు నమోదు చేశారు.
- Tags
- అక్బరుద్దీన్
Next Story