Sat Apr 20 2024 11:04:32 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మ మరణించింది ఎలా?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎలా మృతి చెందారు? ఆమె ఆరోగ్య విషయాలను రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది. జయ మృతిపై సందేహాలు ఉన్నాయి మాకూ, అని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. జయ మృతదేహాన్ని వెలికితీసి పరీక్షలు చేస్తే తప్పేంటని కూడా వ్యాఖ్యానించింది. జయలలితకు ఎలాంటి చికిత్స అందిందో వెల్లడించాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆసుపత్రి యాజమాన్యం జయ ఆరోగ్యంపై గోప్యత పాటించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించింది. జనవరి 9వ తేదీలోగా దీనిపై సమగ్ర నివేదికను అందిచాలని నోటీసుల్లో పేర్కొంది.
- Tags
- జయలలిత
Next Story