ఐదంచెల భద్రతలో ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు భద్రతను మరింత పెంచారు. మావోల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎంకు భద్రత పెంచినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టుల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో పాటుగా మరికొందరు టీడీపీ, బీజేపీ నేతలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ నిఘావర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఏపీ డీజీపీకి హోంశాఖ లేఖ రాసింది.
ప్రస్తుతం చంద్రబాబుకు మూడంచెల భద్రత ఉంది. దాన్ని ఐదంచెలుగా మార్చారు. అదనంగా మరో ఎన్.ఎఎస్.జి బృందాన్ని కూడా ఏపీ సీఎం రక్షణ కోసం కేంద్రం పంపించనుంది. ఆంధ్ర,ఒడిషా బార్డర్ లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో 36 మంది వరకూ మావోయిస్టులు మరణించారు. దీనిపై మావోలు ప్రతీకారచర్యకు దిగేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏపీసీఎంకు రక్షణ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేశారు.
- Tags
- చంద్రబాబు