కాంగ్రెస్ లో వీరిద్దరూ ఢిపరెంట్...!
గవర్నర్ తేనేటి విందుకు కాంగ్రెస్ నేతలు గైర్హాజరుకావాలని నిర్ణయించారు. కాని మాజీ మంత్రి దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాత్రం హాజరయ్యారు. గవర్నర్ తీరును నిరసిస్తూ రాజ్ భవన్ లో ఈరోజు జరిగే ఎట్ హోం కార్యక్రమాన్ని గైర్హాజరవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు ఎవరూ హాజరు కాలేదు. అయితే దానం నాగేందర్ ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యారన్నది కాంగ్రెస్ నేతలకే అర్థం కావడం లేదు. అయితే రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాత్రం తనకు రాజ్ భవన్ కు వెళ్లొద్దని ఎలాంటి సమాచారం లేకపోవడంతో తాను హాజరయ్యానని మాత్రం చెప్పారు. గవర్నర్ రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ మంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు తొలుత ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావించినా ఆయన ఢిల్లీ నుంచి నేరుగా అమరావతికి వెళ్లిపోయారు. దీంతో ఆయన కూడా హాజరుకాలేదు. బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఐ కాంగ్రెస్ లో ఐక్యత లేదన్నది మరోసారి రుజువయ్యింది.
- Tags
- కాంగ్రెస్