కృష్ణను కలిసిన కత్తి మహేష్...!
చంచల్ గూడ జైల్లో మంద కృష్ణ మాదిగను సినీ విమర్శకుడు కత్తి మహేష్ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ....బడుగు,బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్న మంద కృష్ణ మాదిగను, అలాగే మంద కృష్ణను కలవడానికి వచ్చిన గుజరాత్ దళిత స్వతంత్ర ఎంఎల్ఏ జిగ్నెష్ మేవాని కలవడం ఆనందంగా ఉందని కత్తి మహేష్ తెలిపారు. వారు ఏ విధంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో ..తాను కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తాన్నారు. కేసీఆర్ పై తిరుగుబాటు తప్పదని, అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని కత్తి మహేష్ తెలిపారు. ఎమ్మార్పీఎస్ కు తన మద్దతును ప్రకటించారు. జనసేన తోక పార్టీ అని, పవన్ తప్ప ఆ పార్టీలో జనమే లేరని ఆయన అన్నారు. జనసేనను ఎవరైనా రాజకీయ పార్టీ అంటారా? అని ప్రశ్నించారు. పూనంపై తన ప్రశ్నలకు పవన్ స్పందించాలన్నారు. అభిమానులను పవన్ మోసం చేస్తున్నారన్నారు. తాను లేనప్పుడు తన ఇంటికి వెళ్లే అధికారం పవన్ అభిమానులకు ఎవరిచ్చారన్నారు.
- Tags
- కత్తి మహేష్