Wed Apr 24 2024 06:04:22 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావుకు అరుదైన అవకాశం లభించింది. అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం యాన్యువల్ సమ్మిట్ లో పాల్గొనాలని కేటీఆర్ ను ఆహ్వానించింది. ఈ ఏడాది మే నెల 18,19 వ తేదీలలో ఈ యూనివర్సిటీలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో కీలక ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా యూనివర్సిటీ కేటీఆర్ ను కోరింది. ఈ సమావేశానికి యూనివర్సిటీ విద్యార్థులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
అయితే ఈ సదస్సులో కేటీఆర్ రెండున్నరేళ్లలో తెలంగాణలో సాధించిన ప్రగతి, నైపుణ్య శిక్షణ, పరిశ్రమలకు ప్రభుత్వం ఇచ్చిన సహకారం, ఏర్పడిన పరిశ్రమలు, ఐటీ హబ్ తదితర అంశాలపై ప్రసంగించనున్నారు. కేటీఆర్ ను నవభారత ప్రతినిధిగా సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. తెలంగాణను ఒక కేస్ ప్టడీగా ఈ సదస్సులో ప్రెజెంట్ చేయనున్నారు.
Next Story