Tue Apr 23 2024 22:52:35 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా కౌంటరిచ్చారు. నిన్న ఏపీతో తెలంగాణతో పోలికే లేదని చెప్పడం తనను బాధించిందన్నారు. అంతేకాదు నిజాం పాలనలోనే హైదరాబాద్ అభిృద్ధి చెందిందని, ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పడాన్నిచంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. 1995 నుంచి హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే ఎప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందో తెలుసుకోవచ్చన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉండటంతోనే అక్కడ అంధ్ర ప్రజలు పెట్టుబడులు పెట్టారన్నారు. ఆంధ్రపాలకులు తెలంగాణను ధ్వంసం చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల తప్పేమీ లేదని, గత పాలకులు చేసిన పాపం ఫలితంగానే ఏపీ ఇప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు.
Next Story